Wife: బెడ్ రూమ్ లో భార్యను పొడిచి చంపేసి హాల్ లో భర్త ఆత్మహత్య, ఏం జరిగిదంటే ?
బెంగళూరు: కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. వివాహం జరిగిన తరువాత దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. సంవత్సరం నుంచి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. కుటుంబ సభ్యులు, పెద్దలు, చుట్టుపక్కల వాళ్లు దంపతులకు నచ్చ చెబుతూ వచ్చారు. పెద్దలు బుద్దిమాటలు చెప్పిన తరువాత కొంతకాలం సైలెంట్ గా ఉంటున్న దంపతులు మళ్లీ గొడవపడటం మొదలు పెడుతున్నారు. రాజీలు చేసి విసిగిపోయిన పెద్దలు ఇక దంపతులు వారంతకువారే తెలుసుకుని సర్దుకుంటారని పెద్దలు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. బయట నుంచి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దంపతుల గొడవపడిన విషయం చుట్టుపక్కల వారికి వినపడింది. తరువాత దంపతులు ఇంటి నుంచి బయటకు రాలేదు. గొడవపడిన దంపతులు బయటకు రావడానికి అవమానంగా ఫీలైవుంటారని, వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటూ కొంత సేపు వారిని వదిలేశారు. తరువాత బంధువులు వెళ్లి చూడగా భార్యను హత్య చేసిన భర్త అతని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు.
నాలుగు సంవత్సరాల క్రితం !
బెంగళూరు సమీపంలోని కనకపుర తాలుకా సాతనూరులో మంజునాథ్ (32) అనే యువకుడు నివాసం ఉండేవాడు. నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో మంజునాథ్, మళవళ్ళి నివాసి రోజా (28) అనే యువతి వివాహం గ్రాండ్ గా పెళ్లి జరిగింది. బెంగళూరులోని తిగరళపాళ్యలో నివాసం ఉంటున్న మంజునాథ్, రోజా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.
ఏడాది నుంచి గొడవలు
మంజునాథ్, రోజా దంపతుల మద్య ఏడాది నుంచి గొడవలు మొదలైనాయి. మంజునాథ్, రోజా దంపతులకు పిల్లలు లేకపోవడం కూడా గొడవలకు ఒక కారణం అయ్యింది. సంవత్సరం నుంచి మంజునాథ్, రోజా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. కుటుంబ సభ్యులు, పెద్దలు, చుట్టుపక్కల వాళ్లు మంజునాథ్, రోజా దంపతులకు నచ్చ చెబుతూ వచ్చారు.
సైలెంట్ గా ఉండిపోయిన పెద్దలు
పెద్దలు
బుద్దిమాటలు
చెప్పిన
తరువాత
కొంతకాలం
సైలెంట్
గా
ఉంటున్న
మంజునాథ్,
రోజా
దంపతులు
మళ్లీ
గొడవపడటం
మొదలు
పెడుతున్నారు.
రాజీలు
చేసి
విసిగిపోయిన
పెద్దలు
ఇక
మంజునాథ్,
రోజా
దంపతులు
వారంతకువారే
తెలుసుకుని
సర్దుకుంటారని
పెద్దలు
కూడా
సైలెంట్
గా
ఉండిపోయారు.
ఇంటికి వెళ్లి భార్య గొడవపడిన భర్త
ఆదివారం బయట నుంచి ఇంటికి వెళ్లిన మంజునాథ్ అతని భార్య రోజాతో గొడవ పెట్టుకున్నాడు. మంజునాథ్, రోజా దంపతుల గొడవపడిన విషయం చుట్టుపక్కల వారికి వినపడింది. తరువాత మంజునాథ్, రోజా దంపతులు ఇంటి నుంచి బయటకు రాలేదు. గొడవపడిన మంజునాథ్, రోజా దంపతులు బయటకు రావడానికి అవమానంగా ఫీలైవుంటారని, వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటూ కొంత సేపు వారిని వదిలేశారు.
Recommended Video
బెడ్ రూమ్ లో భార్యను చంపేసి హాల్ లో భర్త ఆత్మహత్య
తరువాత బంధువులు వెళ్లి చూడగా బెడ్ రూమ్ లో రోజా శవమై కనిపించింది. రోజాను కత్తితో పొడి దారుణంగా హత్య చేసిన మంజునాథ్ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న బ్యాడరహళ్ళి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. భార్య రోజాను ఎందుకు హత్య చేశాడు ? తరువాత మంజునాథ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? అనే విషయం కచ్చితంగా తెలీయడం లేదని పోలీసులు అంటున్నారు.