వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమ సంబంధం వద్దు అని ఎంత చెప్పినా వినని భర్తను చివరికి అతని భార్య రూ. 5 లక్షలకు అమ్మేసింది. ప్రియురాలి వ్యామోహంతో ఆమె మోజులో పడి తనను పట్టించుకోని ఇలాంటి భర్త ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే అని భార్య తేల్చి చెప్పింది. నీ భర్తను వదిలి ఉండలేను అని చెప్పిన ప్రియురాలికి పంచాయితీ పెద్దల సాక్షిగా నా భర్తను నీకు అప్పగిస్తానని భార్య మాట ఇచ్చింది. అచ్చం సినిమాల్లో జరిగినట్లు ఇలాంటి సంఘటన కర్ణాటకలో జరిగింది. పరస్త్రీ వ్యామోహంలో వున్న భర్తను అమ్మేయాలని నిశ్చచించిన భార్య తెగింపు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !

 భర్త అక్రమ సంబంధం

భర్త అక్రమ సంబంధం

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని ఓ గ్రామంలో రాజే గౌడ, హరిణి (పేర్లు మార్చడం జరిగింది) అనే భార్యా భర్త నివాసం ఉంటున్నారు. అదే గ్రామంలో నివాసం ఉంటున్న ఓ మహిళతో రాజే గౌడ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన హరిణి భర్త రాజేగౌడకు బుద్దిమాటలు చెప్పింది.

 నా దారి రహదారి

నా దారి రహదారి

హరిణి మాటలు లెక్కచెయ్యని రాజేగౌడ నా దారి రహదారి, నేను నా పద్దతి మార్చుకోను అని భార్య హరిణికి చెప్పాడు. భర్త రాజేగౌడ పద్దతిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో భార్య హరిణి విసిగిపోయింది. ఎంత చెప్పినా తన భర్త రాజేగౌడ పరాయి స్త్రీ వ్యామోహంలో ఉండటం ఆమె జీర్ణించుకోలేకపోయింది.

ప్రియురాలితో భర్త రాసలీలలు

ప్రియురాలితో భర్త రాసలీలలు

ప్రియురాలితో కలిసి తన భర్త రాజేగౌడ రాసలీలు సాగిస్తున్నాడని తెలుసుకున్న హరిణి నేరుగా ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. భర్త రాజేగౌడ అతని ప్రియురాలు ఏకాంతంగా రాసలీలలు సాగిస్తున్న విషయం గుర్తించి వారిని రెడ్ హ్యాడెడ్ గా పట్టుకుంది. భర్త రాజేగౌడకు భార్య హరిణి, ఆమె బంధువులు దేహశుద్ది చేశారు.

పంచాతీ పెద్దలు షాక్

పంచాతీ పెద్దలు షాక్

భర్త రాజేగౌడను చితకబాదిన భార్య హరిణి అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళతో గొడవ పెట్టుకుంది. నాభర్తను వదిలేయాలని ఆమెను హెచ్చరించింది. అందరూ పంచాయితీ పెద్దల దగ్గరకు వెళ్లారు. అయితే తన దగ్గర నీ భర్త రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి చెల్లిస్తే నీ భర్త రాజేగౌడను వదిలేస్తానని ప్రియురాలు పంచాయితీ పెద్దల ముందు షరతు పెట్టింది. రాజేగౌడ ప్రియురాలు చెప్పిన మాటలు విన్న పంచాయితీ పెద్దలు షాక్ కు గురైనారు.

ఇలాంటి భర్త వద్దే వద్దు

ఇలాంటి భర్త వద్దే వద్దు

జల్సాల కోసం రూ. 5 లక్షలు అప్పు చేసి ఇంత పెద్ద పంచాయితీ పెట్టి కుటుంబం పరువు తీసిన ఇలాంటి భర్త తనకు వద్దు అని హరిణి తేల్చి చెప్పింది. తాను జీవనం సాగించడానికి రూ. 5 లక్షలు భరణం కావాలని, తాను కోర్టుకు వెలుతానని హరిణి పంచాయితీ పెద్దల ముందు తెగేసి చెప్పింది.

రూ. 5 లక్షల వేలానికి భర్త

రూ. 5 లక్షల వేలానికి భర్త

నువ్వు కోర్టుకు, పంచాయితీల కోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదని, తానే రూ. 5 లక్షలు ఇస్తానని, నీ భర్త రాజేగౌడను తనకు వదిలేయాలని ప్రియురాలు పంచాయితీ పెద్దల ముందు చెప్పింది. భర్తను రూ. 5 లక్షలకు అమ్మేయడానికి హరిణి అంగీకరించింది. వచ్చే నెల నవంబర్ లో రూ. 5 లక్షలు చెల్లించి తన భర్త రాజేగౌడను తీసుకుని వెళ్లాలని హరిణి గ్రామ పెద్దల ముందు ప్రియురాలికి చెప్పింది. భర్తను రూ. 5 లక్షలకు అమ్మేయడానికి సిద్దం అయిన హరిణి తెగింపు చూసి గ్రామ పెద్దలు షాక్ కు గురైనారు. అయితే వేరే మహిళ భర్తను రూ. 5 లక్షలకు కొనుక్కోవాలని నిర్ణయించిన మహిళ (ప్రియురాలు) తెగింపు చూసి గ్రామ పెద్దలు అవాక్కు అయ్యారు.

English summary
Karnataka: Wife Sold Her Husband To His Lover For Five Lacs. This Incident Reported In One Of The Village Of Mandya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X