Wife: కొత్త జంట, సరసాలు అనుకుంటే మ్యాటర్ రివర్స్, భార్యను కసితీరా చంపిన భర్త, వంట !
ముంబాయి/థానే: ఏడాది క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. భర్త చిన్న వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. నవదంపతులు సరసాలు ఆడుకుంటున్నారని, అందుకే చీటికిమాటికి పోట్లాడుకుంటున్నారని మొదట ఇరు వైపుల కుటుంబ సభ్యులు అనుకున్నారు. కొంతకాలం క్రితం దంపతులు నిజంగానే పోట్లాడుకుంటున్నారని పెద్దలు గుర్తించారు. కొత్తగా పెళ్లి చేసుకున్నారని, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని పెద్దలు అనుకున్నారు. అయితే పెద్దలు రాజీచేసి వారి కాపురం చక్కదిద్దాలని అనుకుంటున్న సమయంలో భర్త అతని భార్యను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. అన్నం వండే విషయంలో భార్యను ఆమె భర్త చంపేశాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
ఏడాది క్రితం పెళ్లి
ముంబాయి సమీపంలోని థానేలోని భింవాడి ప్రాంతంలో శంకర్ వాగేమార్ అలియాస్ శంకర్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది శంకర్ కు జ్యోత్స్నా అనే యువతితో పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న శంకర్, జ్యోత్స్నా కొన్ని నెలలు సంతోషంగా కాపురం చేశారు.
చీటికిమాటికి గొడవలు
శంకర్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లి జరిగిన కొంతకాలం నుంచి శంకర్, జ్యోత్స్నా దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. నవదంపతులు శంకర్, జ్యోత్స్నా సరసాలు ఆడుకుంటున్నారని, అందుకే చీటికిమాటికి పోట్లాడుకుంటున్నారని మొదట ఇరు వైపుల కుటుంబ సభ్యులు అనుకున్నారు.
టైమ్ పడుతుంది అనుకున్నారు
కొంతకాలం క్రితం శంకర్, జ్యోత్స్నా దంపతులు నిజంగానే పోట్లాడుకుంటున్నారని పెద్దలు గుర్తించారు. కొత్తగా పెళ్లి చేసుకున్నారని, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని పెద్దలు అనుకున్నారు. జ్యోత్స్నాకు ఆమె తల్లి, శంకర్ కు అతని స్నేహితులు బుద్దిమాటలు చెబుతూ వస్తున్నారు.
అన్నం వండలేదనే చిన్న విషయంలో చంపేశాడు
పెద్దలు రాజీచేసి వారి కాపురం చక్కదిద్దాలని అనుకుంటున్న సమయంలో దారుణం జరిగిపోయింది. రాత్రి ఇంటికి వెళ్లిన శంకర్ అతని భార్య జ్యోత్స్నాను అన్నం పెట్టాలని అడిగాడు. తాను ఇంకా వంట చెయ్యలేదని జ్యోత్స్నా ఆమె భర్తకు చెప్పింది. ఆ సందర్బంలో దంపతుల మద్య మాటామాటా పెరిగింది. సహనం కల్పోయిన శంకర్ అతని భార్య జ్యోత్స్నాను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. అన్నం వండే విషయంలో భార్య జ్యోత్స్నాను ఆమె భర్త శంకర్ చంపేశాడని వెలుగు చూడటం థానేలో హాట్ టాపిక్ అయ్యింది.