పాకిస్తాన్కు ఆర్మీచీఫ్ హెచ్చరిక, అలాచేసే మన జవాన్లకు కూడా..
భారత సరిహద్దు వెంట తాము శాంతిని కోరుకుంటున్నామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆర్మీ డే సందర్భంగా ఆదివారం మాట్లాడారు. సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: భారత సరిహద్దు వెంట తాము శాంతిని కోరుకుంటున్నామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆర్మీ డే సందర్భంగా ఆదివారం మాట్లాడారు. సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు నివాళులు అర్పించారు.
దేశం కోసం పోరాడి అమరులైన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడితే తాము తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
జవాన్ల సమస్యల పైనా స్పందించారు. సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమయితే జవాన్లు తనను నేరుగా కలువవచ్చునని చెప్పారు. దివంగత లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్యకు అవార్డును ప్రదానం చేశారు.
మరోవైపు, సమస్యలను సరైన మార్గంలో అధికారుల దృష్టికి తీసుకు రాకుండా సోషల్ మీడియా ద్వారా బహిరంగం చేసిన సైనికులపై చర్యలు తీసుకుంటామని బిపిన్ రావత్ హెచ్చరించారు. తేజ్బహదూర్ యాదవ్ పోస్ట్ అనంతరం పలు వీడియోలు వస్తున్నాయి. దీంతో ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన చీఫ్ రంగంలోకి దిగారు.