వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘భారత్ లో చావనైనా చస్తాం కానీ, తిరిగి అక్కడకు మాత్రం వెళ్లం..’’

తూటా నుంచి ఎవరైతే తప్పించుకున్నారో, వారే బర్మా నుంచి బయటపడ్డారని, అవసరమైతే ఇక్కడే చస్తాం కానీ, బర్మాకు మాత్రం మళ్లీ తిరిగి వెళ్లబోమని నూర్ ఆలం అనే రోహింగ్యా ముస్లిం ఆవేదన వ్యక్తం చేశాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బర్మా: మయన్మార్ లో తాము ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పడుకోలేదని, ఏ క్షణంలోనైనా ఆర్మీ వచ్చి విరుచుకుపడేదని, క్షణక్షణం ప్రాణాలు అరచేత పెట్టుకుని బతికామని భారత్ లో అక్రమంగా చొరబడి, శరణార్థులుగా బతుకీడుస్తున్న రోహింగ్యా ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండియాలో చెత్తకుప్ప పక్కన పడుకున్నా, బతుకుతామనే ధైర్యం ఉందని... రాత్రి ఎలా గడుస్తుందో అనే బెంగ లేదని తెలిపారు. ఢిల్లీలోని షహీన్ బాగ్ లో చెత్తకుప్ప పక్కన నివసిస్తున్న నూర్ ఆలంతో పాటు మరి కొందరు రోహింగ్యాలు చెప్పిన మాట ఇది.

ిే్ుయంోల

ఈ ప్రాంతంలో 72 రోహింగ్యా శరణార్థ కుటుంబాలు నివసిస్తున్నాయి. 12 మంది కుటుంబసభ్యులతో కలసి నూర్ ఆలం నివసిస్తున్నాడు. ఇక్కడ కటిక పేరదరికం అనుభవిస్తున్నప్పటికీ, ప్రశాంతంగా ఉన్నామని అతను తెలిపాడు.

గత కొన్నేళ్లుగా మయన్మార్ (బర్మా) లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యా తిరుగుబాటుదారులకు, ఆర్మీకి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ లో ఆర్మీ భారీ ఎత్తున తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ ను చేపట్టింది.

ఈ క్రమంలో.. ఊళ్లకు ఊళ్లు నాశనం అయిపోయాయి. అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో, వేలాది మంది రోహింగ్యాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, పొరుగు దేశాలకు పారిపోయారు.

అలాంటి వారిలో నూర్ ఆలం కూడా ఒకరు. సైనిక ఆపరేషన్ ను తప్పించుకుని అతను బర్మాను వీడాడు. సైనిక ఆపరేషన్ లో ఆయన తన దూరపు కుటుంబసభ్యులందరినీ కోల్పోయాడు. ఈ క్రమంలో, తనతో పాటు మరికొందరితో కలసి 15 రోజుల పాటు నడిచి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి భారత్ లో ప్రవేశించాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూటా నుంచి ఎవరైతే తప్పించుకున్నారో, వారే బర్మా నుంచి బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. అవసరమైతే ఇక్కడే చస్తాం కానీ, బర్మాకు మాత్రం మళ్లీ తిరిగి వెళ్లబోమని చెప్పాడు.

English summary
Minister of State for Home Affair Kiren Rijiju in a statement to Parliament mentioned deportation of illegal foreign nationals including Rohingyas highlighting that around 40,000 Rohingyas are living illegally in India. Amid reports that they might get deported, Rohginya Muslims say they prefer to die in India rather than return to Myanmar. "We thank India for allowing us to stay. If the government wants to deport us, it can do it but it will be better if they kill us here instead of sending us back," Noor Alam, a refugee, told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X