విప్రో ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ దర్యాప్తు ప్రారంభించిన కంపెనీ
ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ అయినట్లు ప్రకటించింది. అడ్వాన్స్డ్ ఫిషింగ్ ద్వారా సైబర్ దాడి జరిగినట్లు చెప్పింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని విప్రో స్పష్టం చేసింది. హ్యాకింగ్ ప్రభావాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. దర్యాప్తులో సాయం కోసం ఫోరెన్సిక్ సంస్థను నియమించుకున్నట్లు విప్రో ప్రకటించింది.
మెట్రో నిర్లక్ష్యం : డోర్లో చిక్కుకున్న చీర.. ప్లాట్ఫాంపై మహిళను లాక్కెళ్లిన రైలు !
కస్టమర్ల సిస్టమ్స్ లక్ష్యంగా సైబర్ దాడి జరిగిందని విప్రో వెల్లడించింది. అడ్వాన్స్డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ కారణంగా తమ నెట్వర్క్లోని పలువురు ఉద్యోగుల ఖాతాల్లో అసాధారణ కార్యకలాపాలను గుర్తించామని విప్రో చెప్పింది. ఉద్యోగుల అకౌంట్లను హ్యాక్ చేయడం ద్వారా కొందరు క్లయింట్లపై సైబర్ దాడులకు పాల్పడినట్లు కంపెనీ ప్రాథమిక విచారణలో తేలింది. హ్యాకింగ్ నేపథ్యంలో విప్రో కొత్త ప్రైవేట్ ఈమెయిల్ నెట్వర్క్ రూపకల్పనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.