విప్రో కంపెనీకి వార్నింగ్: రూ. 500 కోట్లు ఇవ్వకుంటే కార్యాలయాలపై దాడులు !
ప్రసిద్ది చెందిన విప్రో కంపెనీకి గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపుల ఈ మెయిల్ పంపించి రూ. 500 కోట్లు ఇవ్వకుంటే బెంగళూరులోని మీ కంపెనీ ఐటీ కార్యాలయాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు కేసు న
బెంగళూరు: ప్రసిద్ది చెందిన విప్రో కంపెనీకి గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపుల ఈ మెయిల్ పంపించాడు. రూ. 500 కోట్లు ఇవ్వకుంటే మీ అంతు చూస్తామని బెదిరించాడు. వెంటనే రూ. 500 కోట్లు చెల్లించాలని, లేదంటే మీ ఐటీ కార్యాలయాలపై దాడులు చేస్తామని హెచ్చరించాడు.
బిట్ కాయిన్ (డిజిటల్ లావాదేవీలు) రూపంలో రూ. 500 కోట్లు ఇవ్వాలని సూచించాడు. నాకు రూ. 500 కోట్లు చెల్లించుకుంటే మే 25లోపు బెంగళూరు నగరంలోని అన్ని విప్రో ఐటీ కంపెనీల కార్యాలయాల మీద దాడులు చేస్తామని హెచ్చరించాడు.
శుక్రవారం (మే 5 ) బెదిరింపు ఈ మెయిల్ రావడంతో విప్రో కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మార్కెట్ లో చలామణిలో ఉన్న కరెన్సీ (రూపాయి, డాలర్, పౌండ్)లకు బదులుగా డిజిటల్ రూపంలో నగదు చెల్లించాలని ఆదేశించి బెదిరింపు ఈ మెయిల్ పంపించిన నిందితుడి కోసం బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు.