దారుణం: పోలీస్ స్టేషన్లోనే మహిళపై గ్యాంగ్రేప్, స్టేషన్ ఇంఛార్జీ కూడా నిందితుడే!
భోపాల్: మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే.. కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తించారు. ఓ 20 ఏళ్ల యువతిని జైల్లో పెట్టిన పోలీసులు.. పది రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ కూడా ఉండటం గమనార్హం.
ఇంట్లో చొరబడి దళిత యువతిపై గ్యాంగ్రేప్: తుపాకీతో బెదిరించి ఘాతుకం, నిందితుల్లో గ్రామపెద్ద
ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రలోని రేవా జిల్లాలో చోటు చేసుకుంది. తనను మే నెలలో లాకప్లో పెట్టి ఐదుగురు పోలీసులు 10 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన రేవాలోని మంగవాన్లో చోటు చేసుకుంది.
కాగా, బాధితురాలో ఓ హత్య కేసులు జైలుపాలయ్యారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. అక్టోబర్ 10న ఈ ఘటన వెలుగులోకి రావడంతో అదనపు జిల్లా జడ్జీతోపాటు న్యాయవాదులు ఆ జైలును పరిశీలించేందుకు వెళ్లారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు తన గోడును వారిముందు వెళ్లబోసుకుంది.
ఘటనపై న్యాయవిచారణ జరపాలని జడ్జీ ఆదేశించారు. మే 9, మే 21న ఐదుగురు పోలీసులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. తాను ఒక మహిళా కానిస్టేబుల్ అని చెప్పి ప్రతిఘటించినప్పటికీ.. తనపై అఘాయిత్యాన్ని కొనసాగించారని ఆరోపించారు.
లీగల్ కమిటీలో భాగమైన ఓ లాయర్ మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం ఈ దారుణం జరిగినట్లు జైలు వార్డెన్ తెలిపారు. బాధితురాలే తనకు ఈ విషయం చెప్పిందని తెలిపారు. కాగా, పోలీసులు మాత్రం ఆ మహిళను మే 21నే అరెస్టు చేశామని చెబుతున్నారు.