శోభనం రాత్రి వీడీయో తీసీన భర్త...! సోషల్ మీడీయాలో పోస్ట్ చేస్తానని బెదిరింపు...!
వింతపోకడలు, విపరీత బుద్దులు సమాజంలో రానురాను మానవత్వ విలువలు తగ్గిపోతున్న విషయం తెలిసిందే..అయితే స్వంత కుటుంభ సభ్యులను సైతం ఇందులో లాగుతున్నారు కొంతమంది వ్యక్తులు. స్వంత భార్య, కూతురు అనే తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే యూపిలోని ఓ దుర్మార్గుడు తన శోభనం రోజు రాత్రీ వీడియోను తీయడమే కాకుండా దాన్ని సోషల్ మీడీయాలో పోస్ట్ చేస్తానని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
శోభనం రాత్రీ వీడియో తీసిన భర్త
యూపిలో బైరల్లి జిల్లాలోని బర్ధారీ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ తన భర్త అక్రమంగా వీడియో తీసీ సోషల్ మీడీయాలో పోస్టు చేసినట్టు పిర్యాధు చేసింది. కాగా సంఘటన వివరాలకు సంబంధించి ఆమే పలు విషయాలను వెళ్లడించింది.బర్దారీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తమకు ఆక్టోబర్ 2018లో పెళ్లైందని.,అనంతరం శోభనం రాత్రీ తన భర్త అసహజసిద్దంగా సెక్స్లో పాల్గోనాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. దీంతో పాటు శోభనం రోజు రాత్రీ సన్నివేశాలను తన ఫోన్లో రికార్డు చేశాడని తెలిపింది. అయితే ఆ సమయంలో తాను అభ్యంతరం చెప్పడంతో రికార్డు చేసిన తర్వాత వాటిని డిలీట్ చేస్తానని హామీ ఇచ్చాడని చెప్పింది.
వీడియోతో వివాదం
అయితే రోజులు గడుస్తున్నా దుర్భిద్దితో తన భర్త వీడీయోను డీలీట్ చేయలేదని, అయితే ఒకరోజు ఫోన్లో ఉన్న వీడియో డిలిట్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో ఆమేను లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలిపింది. అప్పుడు కూడ వీడియో తీశాడని చెప్పింది. అయితే ఇదే విషయాన్ని తన అత్తకు చెప్పినా పట్టించుకోకుండా భర్తనే సమర్ధించిందని తెలిపింది. దీంతో మరింత రెచ్చిపోయిన భర్త రోజు వేధించేవాడని చెప్పింది.
తల్లిదండ్రులకు చెబితే సోషల్ మీడీయో పోస్ట్ చేస్తానని...
ఇక ఇంత జరుగుతున్నా తన తల్లిదండ్రులకు మాత్రం విషయాన్ని చెప్పలేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులకు చెబితే ఫోన్లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడని చెప్పింది.కాగా ఈ ఘర్షణ నేపథ్యంలోనే గత నెల జూన్ 30 తనపై దాడి చేశాడని ,దీంతో ఆమే పుట్టింటికి వెళ్లింది. దీంతో భాదితురాలు తల్లిదండ్రులు కూతురును తీసుకుని బర్దారీ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసును నమోదు చేశారు. అయితే కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ఇలాంటీ సంఘటనలో గతంలో కూడ పాటియాలా జిల్లాలో జరిగినట్టు పోలీసులు తెలిపారు.