కత్తులు, తుపాకిలతో దాడి: మహిళ తలను నరికేశారు
జెహనాబాద్: బీహార్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మీరా దేవి అనే 45 ఏళ్ల మహిళ తలను కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి వేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జెహనాబాద్ లోని దాక్షిణి దౌలత్ పూర్ గ్రామంలో తన భర్త మహేంద్రపాల్కు మధ్యాహ్నం భోజనం మీరా దేవీని కొంత మంది వ్యక్తులు కత్తులు, తుపాకీలతో ఇంట్లోకి చొరబడి ఆమె తలను నరికారు. అనంతరం ఆమె భర్త, మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై దాడి చేసి కొట్టారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహేంద్రపాల్ కోడలు కవితా దేవి, ఆమె కుమారుడు కునాల్లను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. దాడిచేసిన వాళ్లంతా మహేంద్రపాల్ బంధువులేనని తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ ఆదిత్య కుమార్ తెలిపారు. దాడికి పాల్పడ్డ నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.