వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తులు, తుపాకిలతో దాడి: మహిళ తలను నరికేశారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జెహనాబాద్: బీహార్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మీరా దేవి అనే 45 ఏళ్ల మహిళ తలను కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి వేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

జెహనాబాద్ లోని దాక్షిణి దౌలత్ పూర్ గ్రామంలో తన భర్త మహేంద్రపాల్‌కు మధ్యాహ్నం భోజనం మీరా దేవీని కొంత మంది వ్యక్తులు కత్తులు, తుపాకీలతో ఇంట్లోకి చొరబడి ఆమె తలను నరికారు. అనంతరం ఆమె భర్త, మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై దాడి చేసి కొట్టారు.

Woman beheaded, family members injured by relatives in Bihar

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహేంద్రపాల్‌ కోడలు కవితా దేవి, ఆమె కుమారుడు కునాల్‌లను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. దాడిచేసిన వాళ్లంతా మహేంద్రపాల్ బంధువులేనని తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ ఆదిత్య కుమార్ తెలిపారు. దాడికి పాల్పడ్డ నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

English summary
A 45-year-old woman's head was chopped off and three of her family members seriously injured allegedly by her relatives in Dakshini Daulatpur village in the district on Thursday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X