షాక్: చైన్ స్నాచింగ్, దొంగ చేతి వేలు కట్, వేలు ఎత్తుకుని పోలీస్ స్టేషన్ వెళ్లిన మహిళ !
బెంగళూరు: చెన్నై స్నాచింగ్ చేసే సమయంలో దొంగ చేతివేలు తెగి ముక్కలు అయ్యింది. అయినా ఆ దొంగ మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కోని పారిపోయాడు. దొంగ చేతి వేలు ఎత్తుకుని మహిళ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు షాక్ కు గురైనారు.
బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎఇసీఎస్ లేఔట్ లో నాగేశ్వరి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె ఇంటి ముందు నిలబడి మొబైల్ ఫోన్ లో బంధువుతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దొంగ అటు వైపు వెళ్లాడు.
నాగేశ్వరి మెడలో ఉన్న మంగళసూత్రం లాక్కోవడానికి దొంగ ప్రయత్నించాడు. ఆ సందర్బంలో నాగేశ్వరి ప్రతిఘటించారు. నాగేశ్వరి, దొంగ ఇద్దరూ బలంగా మంగళసూత్రం లాగిన సందర్బంలో దొంగ కుడిచెయ్యి వేలు తెగి ముక్కలై కిందపడింది.
వేలు తెగి కిందపడినా దొంగ మాత్రం నాగేశ్వరి మెడలోని మంగళసూత్రం లాక్కోని అక్కడి నుంచి పరారైనాడు. దొంగ చేతివేలు ఎత్తుకుని నాగేశ్వరి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మహిళ చేతిలో రక్తం కారుతున్న చేతి వేలు సూచిన పోలీసులు షాక్ కు గురైనారు. నాగేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి దొంగ కోసం గాలిస్తున్నారు.