ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటానంటూ.. యువతిపై కన్నేసి!, కేకలు వేయడంతో నిప్పంటించి!..
హరియమ్ అనే వ్యక్తి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటానంటూ వచ్చి.. 18ఏళ్ల పక్కింటి యువతిపై అత్యాచారం చేయబోయాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో..కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు.
బరేలీ: ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటానంటూ పక్కింటి తలుపు తట్టాడో యువకుడు. తెలిసిన వ్యక్తే కావడంతో.. యువతి అతన్ని ఇంట్లోకి రానిచ్చింది. కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత అతని దృష్టి ఆమె మీదకు మళ్లింది. ఇంట్లో ఎవరూ లేరని నిర్దారించుకున్న తర్వాత.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు.
దీంతో యువతి గట్టిగా ప్రతిఘటించడంతో.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి అక్కడినుంచి పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్ బరేలీలోని షాహిగణేశ్పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హరియమ్ అనే వ్యక్తి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటానంటూ వచ్చి.. 18ఏళ్ల పక్కింటి యువతిపై అత్యాచారం చేయబోయాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో..కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు.
బాధితురాలి కేకలు విన్న స్థానికులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.