పుట్టింటివాళ్లే!..: ఆమెను నగ్నంగా మార్చి.. 20ఏళ్లు చీకటి గదిలో?
చీకటి గదికి ఉన్న కిటీకి నుంచి మహిళ అత్యంత ధీనస్థితిలో ఉండటం అతను గమనించాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించడంతో.. ఈ ఉదంతం వెలుగుచూసింది.
పనాజీ: వివాహం ఆమె జీవితాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కట్టుకున్నవాడు మోసం చేశాడని పుట్టింటికి వస్తే.. ఆదరించాల్సినవాళ్లు కాస్త అత్యంత కర్కషంగా వ్యవహరించారు. ఏకంగా 20ఏళ్ల పాటు ఆమెను చీకటి గదికే పరిమితం చేసి.. యువతి జీవితాన్ని నరకకూపంగా మార్చేశారు.ఉత్తరగోవాలో ఇటీవలే ఈ ఘటన వెలుగుచూసింది.
18ఏళ్లుగా ఆమె చీకటి గదిలోనే.. విస్మయం కలిగించేలా!, పట్టించుకోరా?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర గోవాలోని క్యాండోలిమ్ కు చెందిన మహిళ 20ఏళ్ల క్రితం ముంబైకి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహానంతరం భర్తతో పాటు ముంబైలోని అత్తింటికి వెళ్లింది. కానీ అక్కడికెళ్లాక గానీ ఆమెకు అసలు విషయం తెలియలేదు. అప్పటికే భర్తకు మరో యువతితో పెళ్లయిందని తెలుసుకుని, తాను మోసపోయానని గ్రహించింది.
పుట్టింటికి వచ్చి:
తిరిగి పుట్టింటికి వచ్చి తన గోడు వెల్లబోసుకుంది. కానీ పుట్టింటివాళ్లు మాత్రం.. ఆమె పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించారు. దు:ఖంలో ఉన్న ఆమెను ఓదార్చి అండగా నిలబడాల్సిందిపోయి.. ఆమెను నగ్నంగా మార్చి చీకటి గదిలోకి తీసేశారు.
20ఏళ్లుగా అరణ్య రోదనే:
20ఏళ్లుగా ఆమె వేదన అరణ్యరోదన గానే మిగిలిపోయింది. నరక కూపం లాంటి చీకటిగదిలో ఒకరకంగా విగతజీవి లాగే బతికింది.ఇలాంటి తరుణంలో..ఆమెను నిర్బంధించిన వ్యవహారం ఓ పోలీస్ కానిస్టేబుల్ కనిపెట్టడం.. ఆ మహిళ జీవితానికి స్వేచ్చను ప్రసాదించినట్లయింది.
ఇలా వెలుగులోకి?:
చీకటి గదికి ఉన్న కిటీకి నుంచి మహిళ అత్యంత ధీనస్థితిలో ఉండటం అతను గమనించాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించడంతో.. ఈ ఉదంతం వెలుగుచూసింది. చీకటి గదిని తెరిచిన పోలీసులు.. దాదాపు యాభై ఏళ్లు వయసు ఉన్న మహిళ నగ్నంగా ధీనాతి ధీన స్థితిలో ఉండటం గమనించారు.
కుటుంబ సభ్యుల వాదన:
అనంతరం చికిత్సం నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం.. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే గదిలో బంధించామని చెప్పడం గమనార్హం. ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు.