వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా కానిస్టేబుల్ పై యాసిడ్ దాడి, భర్తతో గొడవలే కారణమా ,ఇతర కారణాలున్నాయా?

మహిళ కానిస్టేబుల్ పై గుర్తు తెలియని దుండగులు వెల్లూరు జిల్లా తిరుప్పత్తూరులో యాసిడ్ పోసి దాడికి దిగారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తమిళనాడు : ఆమె ప్రజలను రక్షించే పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. అయితే ఆమెకే రక్షణ లేకుండా పోయింది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెపై యాసిడ్ తో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా తిరుప్పతూరులో ఓ మహిళ కానిస్టేబుల్ పై గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి యాసిడ్ పోశారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ పోశారు.

woman constable injured in acid attack at tirppattur

భర్తతో గొడవల కారణంగా పిల్లలతో కలిసి ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ గొడవలతోనే ఆమె పై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడ ఉన్నాయి.అయితే ఈ దాడికి ఎవరూ పాల్పడ్డారనే విషయాన్ని ఇంకా నిర్థారించలేదు.

తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ లావణ్యను వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. లావణ్య ముఖం, చేతులు తీవ్రంగా కాలిపోయాయని వైద్యులు చెప్పారు. ఈ ఘటనకు భాద్యులైన నిందితులను పట్టుకొనేందుకు గాలింపును చేపట్టామని పోలీసులు చెప్పారు.

English summary
A 29 year old woman constable suffered an acid attack at tiruppattur in vellore district,when she was on her way to home from police station when some unidentified people threw acid on her
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X