వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విమానంలో పండండి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ: ముంబైకి మళ్లింపు..
ముంబై: విమానంలో ఓ గర్భిణి మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అబుదాబి నుంచి జకార్తా వెళుతున్న ఎతిహద్ ఎయిర్వేస్ విమానంలో ఇండోనేషియాకు చెందిన ఓ నిండు గర్భిణి ప్రయాణిస్తున్నారు.
మార్గమధ్యలో పురుటినొప్పులు రావడంతో సిబ్బంది సాయంతో విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా జకార్తాకు చేరుకుందని ఎతిహద్ ఎయిర్వేస్కు చెందిన ఓ అధికారి తెలిపారు.
Comments
woman pregnant baby flight mumbai jakarta indonesia abu dhabi మహిళ గర్భిణి విమానం ముంబై జకార్తా ఇండోనేషియా అబుదాబి
English summary
An Indonesian woman delivered a baby on-board an Etihad Airways flight from Abu Dhabi to Jakarta today morning, officials said in Mumbai.
Story first published: Wednesday, October 24, 2018, 17:44 [IST]