ఇంట్లో ఆత్రుతగా వేడి వేడి బోండాలు, బజ్జీలు తినింది, స్పాట్ లో చచ్చిపోయిన మహిళ, ఎలా జరిగింది ?!
చెన్నై: కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలో వేడివేడి బజ్జీలు, బోండాలు తింటున్న మహిళ అవి గొంతులో ఇరుక్కుని మరణించింది. ఆత్రుతగా బజ్జీలు తినడం వలనే మహిళ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. గొంతులో బజ్జీలు ఇరుక్కోవడంతో కొంత సేపు ఆమె విలవిలలాడిపోయింది. విచిత్రంగా బజ్జీలు తిని మహిళ మరణించడంతో చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఒన్ సైడ్ లవ్, యువతికి లైంగిక వేధింపులు, కసితీరా కత్తితో పొడిచి హత్య, చెన్నైలో ఆంధ్రా యువకుడు !
11 ఏళ్ల క్రితం పెళ్లి
చెన్నై నగరంలోని చూలైమేడు కామరాజర్ నగర్ లో పద్మావతి (45), గంగాధర్ దంపతులు నివాసం ఉండేవారు. గంగాధర్, పద్మావతి దంపతులకు 11 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. అయితే గంగాధర్, పద్మావతి దంపతులకు పిల్లలు లేరు. రాయపేట్ లోని ఆటోమొబైల్ సంస్థలో గంగాధర్ ఉద్యోగం చేస్తున్నాడు.
పుట్టింటిలో బజ్జీలు చేశారు
కుటుంబ సమస్యలతో పద్మావతి భర్త గంగాధర్ కు దూరమై పుట్టింటిలో నివాసం ఉంటోంది. సాయంత్రం పద్మావతి తల్లి ఇంటిలో బోండాలు, బజ్జీలు చేసింది. వేడిగా ఉన్న బజ్జీలు, బోండాలు తినమని పద్మావతికి ఆమె తల్లి చెప్పింది. ఆ సమయంలో వంట గదిలోకి పద్మావతి వెళ్లింది.
వేడి వేడిగా ఉన్నాయని !
తల్లి చేసిన బజ్జీలు, బోండాలు వేడివేడిగా ఉండటంతో పద్మావతి ఆత్రుతగా వేగంగా వాటిని తినేసింది. బజ్జీలు కొరక్కుండా తింటున్న సమయంలో అవి పద్మావతి గొంతులో ఇరుక్కుపోయాయి. ఆ సమయంలో విలవిలలాడిన పద్మావతి ఒక్కసారిగా ఇంటిలోనే కుప్పకూలిపోయింది.
బజ్జీలు తింటే ప్రాణాలు పోయాయి
గొంతులో బజ్జీలు ఇరుక్కోవడంతో వెంటనే పద్మావతిని కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పద్మావతిని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించిందని తెలిపారు. బజ్జీలు కొరక్కుండా వేగంగా తినడం వలనే ఇలా జరిగిందని, పిండి పదార్థాలు తినే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. చూలైమేడు పోలీసులు పద్మావతి బజ్జీలు తిని ఎలా మరణించింది ? అంటూ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.