కంపెనీలోని మహిళా ఉద్యోగి అరెస్ట్, ఆగ్రహంతో ఈడీకి నీరవ్ మోడీ లేఖ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు వెళ్లిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి కోపం వచ్చింది. తన కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగి కవితా మంకికర్ను సీబీఐ అరెస్టు చేసింది.
నీరవ్ మోసం-పీఎన్బీ స్కాం: 'నిధులు లేకపోతే మీ ఆస్తులు అమ్మేయండి'
నా సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగిని సీబీఐ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని, ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు పూర్తి ఉల్లంఘనేనని, దర్యాప్తు సంస్థలు మహిళా ఉద్యోగి స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోనప్పుడు నా భద్రత గురించే నాకు ఆందోళన ఉందని, దర్యాప్తు ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చనా సలాయేకు గత నెల 26న నీరవ్ మోడీ లేఖ రాశారు.
కవిత మంకికర్ లాయర్ వాదన ప్రకారం తన క్లయింట్ను రాత్రి ఎనిమిది గంటల తర్వాత అరెస్ట్ చేశారని, చట్ట ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఓ మహిళను అరెస్ట్ చేయరాదన్నారు. ఈడీ గత నెల నీరవ్ మోడీకి సమన్లు పంపగా, అతని నుంచి ఈడీకి రెండు లేఖలు వచ్చాయి.