వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెపై నుంచి 56 బోగీల రైలు వెళ్లింది

By Pratap
|
Google Oneindia TeluguNews

పురులియా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఓ మహిళ పైనుంచి 56 బోగీల గూడ్స్ రైలు వెళ్లింది. అయినా ఆమె బతికే ఉంది. ఆ మహిళ రైల్వే ట్రాక్‌ దాటుతుండగా పొరపాటున ఆమె స్వెటర్‌ ట్రాక్‌లో ఇరుక్కిపోయింది.

దాన్ని లాక్కునేలోపే గూడ్స్‌ రైలు వచ్చేసింది. అక్కడున్న ప్రజలకు ఏమీ తోచలేదు. ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయనే అనుకున్నారు. కానీ ఆమె తెలివిగా ట్రాక్‌ మధ్యలో పడుకుంది. 60 బోగీలు గూడ్స్‌ రైలు వెళ్లిపోయినంత వరకు ఆమె పడుకునే ఉంది.

Woman escapes almost unhurt after 56 railway wagons pass over her

గూడ్స్‌ వెళ్లిన తర్వాత ఆమె నింపాదిగా పైకి లేచింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు, ఆమెను ట్రాక్‌ నుంచి పైకి లేపారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని పురులియాలో జరిగింది. ఆ మహిళా ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుంది.

ఆమెను స్థానిక పురూలియా సదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఆమెను ఇంటికి పంపించారు. పురూలియాలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆమె జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నుంచి వచ్చింది.

English summary
In a bizarre incident, a woman miraculously escapes with minor injuries after 56 railway wagons of a goods train passed over her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X