వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారులు ఏం చేశారు: భర్తతో గొడవ పడి నలుగురు చిన్నారులకు నిప్పంటిచిన మహిళ

|
Google Oneindia TeluguNews

హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ తన నలుగురు పిల్లలకు నిప్పంటిచి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే హమీర్‌పూర్ జిల్లాలోని అమ్గావ్ గ్రామంలో నివసిస్తున్న ప్రేమావతి తన భర్త పిల్లలతో కలిసి నివసిస్తోంది. వారికి నలుగురు పిల్లలు. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. శుక్రవారం ఆమె భర్తతో గొడవ పడింది. అనంతరం పిల్లల కాళ్లు చేతులు కట్టేసి వారిపై కిరోసిన్ పోసి నిప్పటించింది.

పిల్లలపై నిప్పంటిచిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు సప్నా(7), ప్రశాంత్ (5) స్నేహ (3), దివ్యాన్ష్ (1) లపై నిప్పంటించింది ప్రేమావతి. ఇందులో ఏడాది బాలుడు దివ్యాన్ష్ అక్కడికక్కడే మృతి చెందగా..సప్నా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రేమావతి, ప్రశాంత్, స్నేహలను చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ప్రేమావతి , స్నేహలు తుదిశ్వాస విడిచారు.

woman fights with husband, sets fire to children and kills herself

ప్రస్తుతం ప్రశాంత్ చికిత్స పొందుతున్నాడని తెలిపిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపినట్లు ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ గొడవలపై తమకేమీ తెలియదని స్థానికులు చెబుతున్నారు.

English summary
A woman killed herself allegedly after tying the hands and legs of her four children and setting them ablaze following a dispute with her husband, police said Saturday.Three of the children died and one child is battling for life, they said.The incident took place Friday afternoon in Amgaav village in neighbouring Hamirpur district in the Raath Police Station area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X