గోవా బీచ్లో అర్దనగ్నంగా యువతి మృతదేహం
గోవా: గోవాలో ప్రసిద్ది చెందిన బీచ్ లో యువతి మృతదేహం బయటపడటంతో కలకలం రేపింది. ఉత్తర గోవాలోని అరంబాల్ బీచ్ లో శుక్రవారం రాత్రి అర్ధనగ్నంగా ఉన్న 20 సంవత్సరాల యువతి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు చెప్పారు.
గోవా పోలీసు అధికారి శనివారం దేవేంద్ర గడ్ వివరాలు వెల్లడించారు. బీచ్ లో శవమై కనిపించిన యువతికి దాదాపు 20 సంవత్సరాలు ఉంటుందని, ఆమె భారతీయ యువతి అని చెప్పారు. ఇంతకు మించి ఆమె గురించి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.
యువతికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. యువతి అర్దనగ్నంగా ఉందని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. గురువారం రాత్రి ఈ యువతి ముగ్గురు యువకులతో కలిసి బీచ్ లో సంచరించిందని స్థానికులు సమాచారం ఇచ్చారని చెప్పారు.
బీచ్ లో యువతి, యువకులు మందు పార్టీ చేసుకున్నారని వెలుగు చూసిందని పోలీసు అధికారి దేవేంద్ర అన్నారు. ఈమె అతిగా మద్యం సేవించి సముద్రంలో దిగి నీళ్లలో మునిగి మరణించిందా, అత్యాచారానికి, హత్యకు గురైయ్యిందా అని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
యువతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టుం నిర్వహించామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే యువతితో పాటు వచ్చిన ముగ్గురు యువకులు మాయం కావడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.