వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త మీద పగ: బిడ్డల ముందే మహిళ మీద గ్యాంగ్ రేప్, యాసిడ్ పోసి దారుణంగా !

పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి మీద పగతో అతని భార్య మీద గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మహారాష్ట్రలోని థాణే నగరంలో జరిగింది. 32 ఏళ్ల వివాహిత మహిళను ఆమె పిల్లల ముందే గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు.

|
Google Oneindia TeluguNews

థాణే: పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి మీద పగతో అతని భార్య మీద గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మహారాష్ట్రలోని థాణే నగరంలో జరిగింది. 32 ఏళ్ల వివాహిత మహిళను ఆమె పిల్లల ముందే గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు తరువాత ఆమె మీద యాసిడ్ పోశారు.

తీవ్రగాయాలైన బాధితురాలు పూణే నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు చెప్పారు. కల్ఫాటౌన్ షిప్ ఏరియాలో 32 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఆమె భర్త ఆదివారం రాత్రి పని మీద ఊరికి వెళ్లారు. ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటిలో ఉంది.

Woman gang raped and attacked with acid in Thane

ఆ సందర్బంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గోపాల్ శంకర్, శంషు హుస్సేన్, రంగప్ప భత్కట్, వెంకటేష్ పటేల్, ఆశ్వర్ రాముల్, శీర్షప్ప అనే నిందితులు మహిళ ఇంటిలో చొరబడ్డారు. తరువాత మహిళ ఇద్దరు పిల్లలను చున్నీలతో కట్టేశారు.

ఇద్దరు పిల్లల ముందే మహిళను గ్యాంగ్ రేప్ చేశారు. తరువాత కసి తీరకపోవడంతో వెంట తీసుకెళ్లిన యాసిడ్ ఆమె శరీరం మీద పోసి అక్కడి నుంచి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు.

మహిళ మీద అత్యాచారం చేసి యాసిడ్ పోసిన గోపాల్ శంకర్, శంషు హుస్సేన్, రంగప్ప భత్కట్ అనే నిందితులను అరెస్టు చేశామని, మిగిలిన నిందితులు పరారైనారని పోలీసులు చెప్పారు. మహిళ భర్త మీద పగతోనే ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి యాసిడ్ పోశారని పోలీసులు తెలిపారు.

English summary
A 32-year-old married woman was allegedly raped by two men at her residence in Kalwa township, police had said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X