షాకింగ్: పెళ్లికి గంటల ముందు బ్యూటీ పార్లర్ నుంచి వధువును దారుణంగా లాక్కెళ్లారు
అమృత్సర్: పెళ్లికి కొద్ది గంటల ముందు ఓ యువతిని ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పీటల మీద ఎక్కడానికి ముందు ఆ యువతి బ్యూటీపార్లర్ వెళ్లింది. అలా వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఆమెను కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం నాడు జరిగింది.
మేకప్ వేసుకొని బయటకు రాగానే
పంజాబ్లోని ముక్త్సర్లో శుక్రవారం ఉదయం అయిదున్నర గంటల ప్రాంతంలో యువతి బ్యూటీపార్లర్ వెళ్లింది. మేకప్ చేసుకుని బయటకు వచ్చింది. అదే సమయంలో అక్కడ ఉన్న యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు జరుపుతున్నారు.
బ్యూటీ పార్లర్ బయటే వేచి చూసి
కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆ బ్యూటీ పార్లర్ బయటే చాలాసేపు వేచి చూశారు. ఆమె బయటకు రాగానే ఎత్తుకెళ్లారు. కిడ్నాప్ చేసే సమయంలో ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించినట్లు రికార్డయిందని చెప్పారు. యువతి తప్పించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా దుండగులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
సీసీ కెమెరాల్లో రికార్డ్
ఈ సంఘటన అంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ముక్త్సర్ ఎస్పీ వెల్లడించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆ బ్యూటీ పార్లర్ బయటే చాలాసేపటి నుంచి వేచి చూస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో ఉందని, కిడ్నాప్ చేసే సమయంలో ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించినట్లు రికార్డయిందని తెలిపారు. ఆ తర్వాత దుండగులు యువతిని కొద్దిసేపటి తర్వాత బస్టాండ్ వద్ద వదిలి దుండగులు పారిపోయారని, ప్రస్తుతం యువతి ముక్తాసర్ పోలీసుల రక్షణలో ఉందని ఎస్హెచ్వో తెలిపారు. కిడ్నాప్కు ప్రయత్నించిన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఈ పని ఎవరు చేశారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.