వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి: ‘శని’ ఆలయ అధ్యక్షురాలిగా మహిళ

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉన్న శని శింగనాపూర్ ఆలయం 5 శతాబ్దాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ చైర్‌పర్సన్‌గా సోమవారం నియమితులయ్యారు. గృహిణి అనితా షీతే(40)కు శని శింగనాపూర్‌ ఆలయ ట్రస్టు బాధ్యతలు అప్పగించారు.

ఐదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, ఈ కమిటీలో 11 మంది ధర్మకర్తల్లో మరో మహిళ కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలోపలకు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించడానికి ఇటీవల ప్రయత్నం జరిగినప్పుడు ఘర్షణ చోటుచేసుకొంది.

Woman to head Shani Shingnapur temple trust

ఆలయంలో ఓ మహిళ ప్రవేశించినందుకు ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదమయింది. అయిదు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో మహిళలపై ఉన్న నిషేధం కొనసాగేలా చూస్తాననీ, గర్భాలయంలోకి మహిళల్ని అనుమతించే ఆలోచనే లేదని అనితా షీతే మీడియాకు స్పష్టం చేశారు.

సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు ఆలయ వేదిక మీదికి వచ్చి పూజలు చేయడంతో ఈ ఆలయం ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. శని ఆలయంలో ‘చౌతారా'(శని విగ్రహం) వద్ద పూజలు చేసేందుకు పురుషులనే అనుమతిస్తారు. మహిళలు శని విగ్రహానికి తైలపూజ చేసే సంప్రదాయం ఇప్పటివరకు లేదు.

English summary
Marking a groundbreaking shift in age-old tradition, the trust board of the famous Shani Shingnapur Temple in Maharashtra’s Ahmednagar district has appointed, in a first, a woman as its president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X