భార్య మర్మాంగంలో యాసిడ్ పోశాడు
ఒడిశా: అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య మీద యాసిడ్ తో దాడి చేశాడు. ఒడిశాలోని కొంధమాల్ జిల్లాలోని డిమిరిగూడ గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.
డిమిరిగూడ గ్రామంలో దంపతులు నివాసం ఉంటున్నారు. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. నిత్యం ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగేది.
మంగళవారం రాత్రి మళ్లీ ఇద్దరూ గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆ సమయంలో ముందుగా వెంట తెచ్చుకున్న యాసిడ్ తీసుకుని భార్య చాతీ, మర్మాంగం మీద పోశాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో అతడు అక్కడి నుంచి పరారైనాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఫూల్బనిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆమె సున్నితమైన భాగాలలో యాసిడ్ పోశారని, మెరుగైన చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. భర్తను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.