కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్: పెట్రోల్ పంప్ పక్కన పడేసి పరారీ
Recommended Video
ఫరీదాబాద్: హర్యానాలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులు శనివారంనాడు 22 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై కదులుతున్న కారులో రెండు గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారు.
ఈ సంఘటన హర్యానాలోని ఫరిదాబాదులో జరిగింది. అత్యాచారం చేసిన తర్వా ఆమెను సిక్రి గ్రామంలోని పెట్రోల్ పంపు వద్ద పడేసి పారిపోయారు. ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు.
ఆ సంఘటన సాయంత్రం 7 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో (ఎస్యువి)లోకి బలవంతంగా లాక్కున్నారని, ఆ తర్వాత వాహనంలో ఆమెపై అత్యాచారం చేశారని అన్నారు.
ఆమె శరీరంపై చారికలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని చెప్పారు. దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏ విధమైన అరెస్టులూ జరగలేదు.
అదే రోజు జింద్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే.