వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాఫి తోటలో ఏనుగు దాడి: మహిళ దుర్మరణం

|
Google Oneindia TeluguNews

కోడగు: కాఫి తోటలో పని చెయ్యడానికి వెళుతున్న కూలీల మీద మదపుటేనుగు దాడి చేసింది. నిస్సహాయ స్థితిలో చిక్కిన మహిళను దారుణంగా చంపేసింది. ఏనుగు దాడిలో పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కర్ణాటకలోని కోడగు జిల్లా వీరాజపేట తాలుకాలోని గోయ్యా గ్రామంలో కమలమ్మ (35), వాసంతి తదితరులు నివాసం ఉంటున్నారు. వీరు అదే గ్రామం సమీపంలోని కాఫీ ఎస్టేట్ లలో కూలి పని చేస్తుంటారు. బుధవారం ఉదయం కమలమ్మ తదితరులు కాఫి తోట దగ్గరకు బయలుదేరారు.

Woman Killed in elephant attack in kodagu district in Karnataka

మార్గం మధ్యలో ఏనుగు ఒక్క సారిగా వీరి మీద దాడికి పాల్పడింది. తొండంతో కమలమ్మను ఎత్తి కిందకు వేసి దాడి చేసింది. తరువాత మిగిలిన కూలీల మీద దాడి చేసింది. కాఫి తోటను ధ్వంసం చేసింది. తరువాత అక్కడి నుండి సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది.

విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వీరాజపేటలోని ఆసుపత్రికి తరలించారు. వాసంతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఆహారం కోసం కాఫి తోటలోకి వచ్చిన ఏనుగు కూలీల మీద దాడి చేసిందని పోలీసులు తెలిపారు.

English summary
A 35-year-old man was killed in a wild elephant attack at Birunani,Kodagu district in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X