వివాహేతర సంబంధం వద్దన్నందుకు ప్రియుడితో కలిసి భర్తను చంపి, బావిలో పడేసింది
సేలం: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రియుడి కోసం భర్తను చంపిన భార్యల సంఘటనలు పలుమార్లు విన్నాం. ఇలాంటి సంఘటననే కేరళలోని సేలం జిల్లాలోను ఇటీవల చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాటని ఓ మహిళ తన భర్తను హతమార్చింది. ఈ సంఘటన సేలం సమీపంలోని కరుప్పూరు ఉప్పుకినరు ప్రాంతంలో జరిగింది.
మగాళ్ల దినోత్సవం రోజున బయటపడ్డ మగువ ఆకృత్యాలు..ఆమెకు బలైన అరడజను పురుషులు
నలభై ఏళ్ల సెల్వకుమార్ వ్యాపారవేత్త. అతని భార్య ఐశ్వర్య. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్ని రోజులుగా సెల్వకుమార్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ తర్వాత గత నెల 10వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి మళ్లీ ఇంటికి రాలేదు.
ఫిర్యాదు చేసిన విషయం తెలిసి
దీంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసి, ఐశ్వర్య తన చిన్నాన్న వద్దకు వెళ్లింది. తనకు, భర్తకు మధ్య గొడవ జరిగిందని, ఈ ఘటనలో తన భర్త మృతి చెందాడని, అతనిని బావిలో పడేశానని ఆమె తన చిన్నాన్నకు చెప్పింది.
వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకారం
అనంతరం అతనితో కలిసి ఐశ్వర్య పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. పోలీసులు ఆమెను అన్ని కోణాల్లో విచారించారు. మనస్పర్థలు ఎందుకు వచ్చాయి, ఏం జరిగింది అనే కోణంలో విచారించారు. ఈ విచారణలో వారికి షాకింగ్ విషయం తెలిసిందే. ఐశ్వర్యకు రవి అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో గుర్తించారు.
భర్తను కొట్టి బావిలో పడేసింది
ఐశ్వర్య పోలీసుల ఎదుట దీనిని అంగీకరించింది. రవి మెకానిక్గా పని చేస్తుంటాడు. రవితో వివాహేతర సంబంధం పైన తన భర్త మందలించాడని, దీంతో అగ్రహానికి గురై అతనిని కొట్టానని, స్పృహ కోల్పోవడంతో తన ప్రియుడు రవితో కలిసి గొంతు నులిమి చంపేసినట్లు చెప్పింది. అనంతరం ఇరువురం కలిసి మృతదేహాన్ని బావిలో పడేశామని తెలిపింది.
దోశలు తీసే గరిటతో బాదింది
నిందితురాలు తప్పు అంగీకరించడంతో పోలీసులు ఐశ్వర్యను, ఆమె ప్రియుడు రవిని అరెస్టు చేశారు. ఐశ్వర్య, సెల్వకుమార్లు ఉండే ప్రాంతంలోనే రవి ఉంటున్నాడు. దీంతో వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై భర్తతో ఆమెకు వాగ్వాదం జరిగింది. అప్పుడు దోశలు తీసే గరిటతో భర్తను పదేపదే బాదింది. రవి, ఐశ్వర్య కలిసి భారీ బండను సెల్వకుమార్కు కట్టి బావిలో పడేశారు.