అడ్రస్ కోసం వెతుకుతుండగా,ఆమె చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారు. దంపతులు ఏం చేశారంటే
అడ్రస్ వెతికితోంటే, అమానుషానికి పాల్పడ్డారు ఇద్దరు దుండుగులు. తమను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి రక్తం వచ్చేలా కర్రతో కొట్టారు.వారిని అడ్డుకొనే వారే లేకుండా పోయారు.
లక్నో:అడ్రస్ వెతికితోంటే, అమానుషానికి పాల్పడ్డారు ఇద్దరు దుండుగులు. తమను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి రక్తం వచ్చేలా కర్రతో కొట్టారు.వారిని అడ్డుకొనే వారే లేకుండా పోయారు. ఈ ఘటనను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక నిందితుడిని పోలీసులు అరెస్టుచేశారు. మరో నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మణిపురి జిల్లాల్లో ఈ ఘటన చోటుచేసుకొంది. నవదంపతులు తాము వెళ్ళాల్సిన ప్రాంతం అడ్రస్ వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఓ మార్కెట్ లో స్థానికులను వారు అడ్రస్ ను అడుగుతున్నారు.
దీంతో అతనికి కోపం వచ్చింది. మహిళను వేధించకుండా అడ్డుపడుతున్నాడని తన స్నేహితుడితో కలిసి కర్రతో భార్య, భర్తలను విపరీతంగా కొట్టారు. ఈ ఘటనలో ఆ మహిళ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఈ ఘటనను సినిమా చూసినట్టు వినోదం చూశారు తప్ప ఆపలేదు. ఈ ఘటనను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని ఆనంద్ యాదవ్ గా గుర్తించారు. మరోకరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిందితులను అరెస్టు చేయకపోతే తనను తాను కాల్చుకొని చనిపోతానని బాధితురాలు పోలీసులకు చెప్పింది.నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.