రేప్ను అడ్డుకున్న మహిళను కాల్చి చంపారు
సౌత్ గారో హిల్స్: మేఘాలయలో ఓ మహిళ పట్ల దారుణం జరిగింది. మేఘాలయలో ఏ మహిళపై మిలిటెంట్లు అసభ్యంగా ప్రవర్తించారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ మహిళపై కాల్పులు జరిపి హత్య చేశారు. తన ఇంటి వెలుపల ఆమెపై అసభ్యంగా ప్రవర్తించి, ఆటోమేటిక్ ఆసాల్ట్ రైఫిల్తో కాల్చి చంపారు. మహిళ తనపై అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో వారు కాల్చి చంపారు.
మంగళవారం సాయంత్రం ఆ సంఘటన చోటు చేసుకుంది. ఆమె ఐదుగురు పిల్లలను, భర్తను ఇంటిలో నిర్బంధించారు. తొలుత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమె ప్రతిఘటించడంతో కాల్చి చంపారు. ఆమె తలపై దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు ఈ విషయం చెప్పారు.
దాడిన చేసినవారి గారో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ మిలిటెంట్లుగా అనుమానిస్తున్నారు. ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వం 2012లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ పలు హత్యలు, అపహరణలకు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ఆ సంఘటన జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళ వయస్సు దాదాపు 35 ఏళ్లు ఉంటుంది.