వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంటీతో 17 ఏళ్ల బాలుడి అక్రమ సంబంధం, బ్లాక్ మెయిల్, నగ్నంగా చేసి నరాలు కట్ చేసి హత్య!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ విల్లుపురం: బాలుడితో అక్రమ సంబంధం కారణంగా ఓ మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. రైల్వే క్వాటర్స్ కాలనీలో మహిళతో శారీరక సంబంధం సాగించిన తరువాత ఆమెను నగ్నంగా చేసి నరాలు కట్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చెయ్యగా దిమ్మతిరిగే విషయాలు వెలుగు చేశారు. 35 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న 17 బాలుడు ఆమె బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అత్యంత కిరాతకంగా హత్య చేశాడని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు.

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

రైల్వే క్వాటర్స్ కాలనీ

రైల్వే క్వాటర్స్ కాలనీ

తమిళనాడులోని విల్లుపురం దక్షిణ రైల్వే కాలనీలో గత నెల 14వ తేదీ 35 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. మహిళ శరీరం మీద ఎలాంటి డ్రెస్ లేకపోవడం, ఆమె శరీరంలోని నరాలు కట్ చెయ్యడంతో మొత్తం గాయాలు కావడంతో అటువైపు వెళ్లిన వారు విషయం గుర్తించి గట్టిగా కేకలు వేసి అక్కడి నుంచి పరుగు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మహిళతో శారీరక సుఖం, హత్య

మహిళతో శారీరక సుఖం, హత్య

కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మహిళతో శారీరక సుఖం అనుభవించిన తరువాత ఆమె తల తదితర చోట్ల నరాలు కట్ చేసి అత్యంత కిరాతకంగా బండరాయితో దాడి చేసి హత్య చేశారని, రాళ్ల దాడితో శరీరం మొత్తం గాయాలైనాయని ప్రభుత్వ వైద్యుల నివేదికలో వెలుగు చూసింది.

బాలుడిపై అనుమానం

బాలుడిపై అనుమానం

హత్యకు గురైన మహిళ అదే రోజు రాత్రి 17 ఏళ్ల బాలుడితో ఆ ప్రాంతంలో తిరిగిందని స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విల్లుపురం దక్షిణ రైల్వే కాలనీలో చాల వరకు పాడుపడిన ఇండ్లు ఉన్నాయి. అదే రైల్వే కాలనీలోని పాడుపడిన ఇండ్ల దగ్గర గత 14వ తేదీ రాత్రి 17 ఏళ్ల బాలుడు, ఓ మహిళ తిరుగిన విషయం తాము చూశామని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆంటీతో బాలుడి అక్రమ సంబంధం

ఆంటీతో బాలుడి అక్రమ సంబంధం

రైల్వే కాలనీ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. హత్యకు గురైన మహిళతో తాను సహజీవనం చేస్తున్నానని బాలుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. గత నెల 14వ తేదీ రాత్రి తాను ఆమె పాడుపడిన రైల్వే కాలనీలోని ఇంటిలో శారీరకంగా కలిశామని బాలుడు పోలీసులకు చెప్పాడు.

బ్లాక్ మెయిల్ చేస్తే చంపేశా!

బ్లాక్ మెయిల్ చేస్తే చంపేశా!

తనతో శారీరక సుఖం అనుభవించిన తరువాత ఆ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పిందని, తన దగ్గర ఉన్న డబ్బులు అప్పుడే ఇచ్చానని బాలుడు పోలీసులకు చెప్పాడు. అయితే తనకు ఇంకా డబ్బలు ఇవ్వాలని, లేదంటే తనను రేప్ చేశావని మీ తల్లిదండ్రులకు, పోలీసులకు చెబుతానని ఆమె బెదిరించిందని, భయంతో బండరాయి తీసుకుని ఆమె తలమీద దాడి చేసి నరాలు కట్ చేసి చంపేశానని బాలుడు పోలీసులకు చెప్పారు. శారీరక సుఖం కోసం ఆమె శరీరం మీద బట్టలు మొత్తం తీసేసిన బాలుడు అదే స్థితిలో ఉన్న ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడని పోలీసులు అన్నారు. బాలుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి అతన్ని రిమాండ్ హోమ్ కు తరలించి విచారణ చేస్తున్నామని విల్లుపురం పోలీసుతెలిపారు.

English summary
35 year old woman murdered by 17 year old boy near vizhupuram in Tamil Nadu due to illegal relationship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X