వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెళ్లి కానుక: విషం పెట్టి చంపిన భర్త, అత్తామామలు
ఆ తర్వాత ఏప్రిల్ 15న ఇరు కుటుంబాల అంగీకారంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో సల్మాకు భర్త పేరున ఉన్న 2 బిగాల భూమిని ఆమె పేరున చేశారు. కాగా, వివాహం అయిన నెల రోజుల నుంచే ఆమెపై భర్త, అత్తామామలు వేధింపులు మొదలుపెట్టారు. తమ భూమిని తమకు ఇవ్వాలని ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.
ఈ క్రమంలో ఆదివారం ఆమెకు భర్త, అత్తామామలు విషం ఇచ్చి హత్య చేశారు. తన కూతురు మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురైన సల్మా తండ్రి అహ్మద్ పోలీసులను ఆశ్రయించాడు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కక్రోలి పోలీసులు నిందితులైన సల్మా భర్త జావేద్, అత్తామామలు సన్నో, అస్లాం, బావ బుర, అతని భార్య సబ్ర బేగంలపై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
English summary
A 20-year-old woman was allegedly poisoned to death by her husband and in-laws when she refused to return her wedding gift to them at Kakroli village here, police said on Monday.
Story first published: Monday, September 29, 2014, 17:28 [IST]