వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ వ్యతిరేక సభ: పాక్ జిందాబాద్ అంటూ యువతి కలకలం, అసదుద్దీన్ ఓవైసీ ఖండన

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఓ యువతి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి కలకలం సృష్టించింది. ఈ సభలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని ప్రసంగించారు.

సీఏఏకు వ్యతిరేకంగా 'సేవ్ కానిస్టిట్యూషన్'పేరుతో నిర్వహించిన సభలో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించిన అనంతరం అమూల్య అనే యువతి వేదికపైకి వచ్చింది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. పాకిస్థాన్ జిందాబాద్.. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ ఏదో చెప్పబోయింది.. ఇంతలోనే అక్కడున్నవారంతా ఆమెను అడ్డుకున్నారు.

Woman raises pro-Pak slogans at anti-CAA stir in Bengaluru in the presence of AIMIM chief Owaisi

ఆ యువతి వద్ద నుంచి వెంటనే మైక్ లాక్కున్నారు అసదుద్దీన్ ఓవైసీ, మరికొందరు ఆమెను అక్కడ్నుంచి పంపించేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. ఆ యువతి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆమె ఎవరో తెలియదని, ఈ సభకు ఆమెను ఆహ్వానించలేదని చెప్పారు. తాము భారత్ లోనే ఉంటాం.. భారత్ కోసం ఉంటామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని చెప్పారు.

English summary
Leaving the organisers of an event to protest against the CAA, NRC and NRP here red-faced, a young woman on Thursday raised "Pakistan Zindabad" slogan in the presence of AIMIM chief Asaduddin Owaisi, who denounced her action and asserted "we are for India".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X