స్వామీజీ ఆశీర్వాదం కోసం వెళ్లిన మహిళపై రేప్
ఢిల్లీ : ఆధ్యాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు దేశంలో నిత్యక్రుత్యం అయిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు అత్యాచారం చేశాడు. జూలై28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన దంపతులు ఉత్తరప్రదేశ్ లోని విపిన్ మహారాజ్ గురును దర్శనార్థం ఆయన ఆశ్రమానికి వెళ్లారు. వృందావనంలోని రాస్ బెహరి ట్రస్ట్ ఛారిటబుల్ లో ట్రస్ట్ లో ఆయన్ను దర్శించుకున్నారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకుడు ఒకరు వివాహిత భర్తను ఏదో పనికి పురామాయించడంతో.. పని నిమిత్తం మార్కెట్ కు వెళ్లాడాయన.
ఆ సమయంలో వివాహిత ఒంటరిగా ఉండడంతో.. ఆశ్రమ నిర్వాహకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే పరిణమాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు.ఢిల్లీ చేరుకున్న తర్వాత విషయాన్ని భర్తకు చెప్పడంతో.. దంపతులిద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు కేసును యూపీ పోలీసులకు బదలాయించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.