ఒంటరిగా ఉన్న కోడలిపై మామ అత్యాచారం
పాల్ఘర్: మహారాష్ట్రలోని నిఖా గోటన్పడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 30ఏళ్ల మహిళపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన గ్రామస్తులు నిందితుడ్ని చితకబాదారు.
నవంబర్ 20న బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అతనికి దేహశుద్ధి చేశారు.
అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్నామని తెలిపిన పోలీసులు.. నిందితుడ్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
అసోంలో ట్రక్కును ఢీకొన్న బస్సు: ఐదుగురు మృతి
అసోంలోని దుబ్రి ప్రాంతంలో బస్సును ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.