ప్రియుడు రేప్: రక్షిస్తామంటూ వచ్చి సామూహిక అత్యాచారం
ఛంఢీఘడ్: స్నేహితుడు రేప్ చేస్తోంటే రక్షించేందుకు వచ్చిన ముగ్గురు కూడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఛంఢీఘడ్లో చోటు చేసుకొంది.బాధితురాలిని కాపాడుతామని నమ్మించిన నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
వివాహేతర సంబంధం: క్రిస్మస్ వేడుకల్లో స్నేహితుడిని చంపేసిన దంతవైద్యుడు
మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు చేసినా కానీ, ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకొంటున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భర్త సహయంతో నవవధువుపై గ్యాంగ్రేప్: వీడియో తీసి, ట్రిపుల్ తలాక్
పంజాబ్ రాష్ట్రంలో బాధితురాలి నిస్సహాయతను ఆసరాగా చేసుకొన్న నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.రక్షించే పేరుతో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యువతిపై గ్యాంగ్ రేప్
ఛంఢీఘడ్ రాయ్పూర్లోని ఓ మహిళ భర్త చనిపోవడంతో హోటల్లో పనిచేస్తోంది.ఆమెతో సురేష్ సాహు అనే యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడు.ఆమెను నమ్మిన బాధితురాలు సురేష్తో వెళ్ళింది. నమ్మించి కప్పా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.తనను రక్షించాలని బాధితురాలు కేకలు పెడుతుంటే, అదే దారిలో వెళుతున్న హరీష్ చంద్రకార్, త్రినాథ్ మహానంద్, వినయ్ యాదవ్ లకు అవి వినపడ్డాయి. దీంతో వారు అక్కడికి వచ్చి సురేష్ను బెదిరించి పంపారు.ఆ తర్వాత ఈ ముగ్గురు బాధితురాలిపై అత్యాచారానికి పూనుకొన్నారు.
చంపుతామని బెదిరించి
స్నేహితుడు సురేష్ నుండి రక్షిస్తారని భావించిన ముగ్గురు నిందితులు చంపుతామని బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు.గ్యాంగ్రేప్ ఘటనను బయటకు చెప్పొద్దని హెచ్చరించారు. తీవ్ర భయబ్రాంతులకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు
బాధితురాలిపై గ్యాంగ్రేప్కు పాల్పడిన నిందితులు ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు ఎలాగోలా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
బాధితురాలిపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తరలించారు.