షాకింగ్ : కదులుతున్న బస్సులో మహిళపై రెండుసార్లు అత్యాచారం...
ఇటీవలి కాలంలో భారత్లో మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. గత వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్లలో పలు దారుణ అత్యాచార,హత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా మహారాష్ట్రలోనూ ఓ అత్యాచార ఘటన వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు అత్యాచారానికి గురైంది.
బాధితురాలి కథనం ప్రకారం... నాగ్పూర్ నుంచి పుణే వెళ్లేందుకు గుడ్విల్ ట్రావెల్స్కి చెందిన ఓ లగ్జరీ బస్సులో ఆమె బయలుదేరింది. మొదట సీటు నంబర్.5లో ఆమె కూర్చోగా... బస్సు క్లీనర్ ఆమెను సీటు నంబర్.15లో కూర్చోవాలని చెప్పాడు. దీంతో ఆ సీటులోకి మారింది. ఆ తర్వాత క్లీనర్ ఆమెపై బలవంతంగా రెండుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నోరు తెరిస్తే చంపేస్తానని,బస్సు నుంచి బయటకు విసిరేస్తానని బెదిరించాడు.
మరుసటి రోజు పుణేలోని రాజ్నగావ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఘటన జరిగిన వషీం జిల్లాలో కావడంతో పుణే పోలీసులు కేసును అక్కడికి బదిలీ చేశారు. ఆపై అక్కడి పోలీసులు గుడ్విల్ బస్సు క్లీనర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా,ఇటీవల ఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లా ఉఘాటికి చెందిన 50 ఏళ్ల ఓ మహిళ ఆదివారం(జనవరి 3)పై స్థానిక పూజారి,అతని ఇద్దరు అనుచరులు గ్యాంగ్ రేప్కి పాల్పడిన సంగతి తెలిసిందే. రేప్ సమయంలో ఆమె జననాంగాల్లో ఇనుప రాడ్లు దూర్చి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ మహిళ మృతి చెందింది. బదౌని ఘటన మరవకముందే తరహాలో జార్ఖండ్లో మరో దారణం చోటు చేసుకుంది. చత్రా జిల్లాలోని కోబ్నా గ్రామంలో 50 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు.బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
గత శనివారం(జనవరి 9) మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఉన్న అమిలియా పట్టణంలో 45 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇనుప రాడ్డుతో ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.