భర్తకు అనారోగ్యం: చికిత్స కోసం రూ. 45వేలకు కొడుకు విక్రయం
Recommended Video
లక్నో: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్తకు చికిత్స చేయించేందుకు కన్న కొడుకును రూ. 45 వేలకు విక్రయించింది ఓ తల్లి. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా ఢాకియా కోహ్ గ్రామానికి చెందిన హర స్వరూప్ మౌర్య, సంజుదేవీలు భార్య, భర్తలు. మౌర్య భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేసేవాడు.
#UttarPradesh: Woman sold her 15-day-old baby for Rs 45000 for treatment of her ailing husband in #Bareilly's #Mirganj, says "didn't have adequate funds" pic.twitter.com/HtJMZOtlpz
— ANI UP (@ANINewsUP) January 2, 2018
ఓ ఇంటి నిర్మాణ పనిలో ఉండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మౌర్య తీవ్రంగా గాయపడ్డాడు. మూడు నెలలుగా మౌర్య ఆసుపత్రిలో ఉన్నాడు. భర్త మంచాన పడ్డాడు.దీంతో పూట గడవడం కూడ ఆ కుటుంబానికి కష్టంగా మారింది. అప్పటికే గర్భవతిగా ఉన్న సంజు దేవి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే భర్తకు వైద్యం చేయించేందుకు తన 15 ఏళ్ళ బిడ్డను రూ.45 వేలకు విక్రయించింది ఆ తల్లి. మౌర్య కుటుంబాన్ని తాము ఆదుకొంటామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.