టెక్కీ: రెండున్నర ఏళ్ళుగా సహజీవనం పెళ్ళి కోసం గొడవ, స్నేహితుడే పట్టించాడు
పహజీవనం చేస్తూ పెళ్ళి విషయమై గొడవపడి టెక్కీని హతమార్చాడు భాగస్వామి. ఈ ఘటన మహరాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకొంది.క్షణికావేశంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
థానే:సహజీవనం చేస్తూ పెళ్ళి విషయమై గొడవపడినందుకుగాను ఆమె భాగస్వామిని గొంతు నులిమి చంపాడు .ఈ ఘటన మహరాష్ట్ర థానేలో జిల్లాలోని బద్లాపూర్ లో బుదవారం నాడు చోటుచేసుకొంది. ఈ ఘటనలో టెక్కీ మరణించింది.
మహరాష్ట్రలోని నాసిక్ చెందిన పూనం పూన్యకర్ గజ్ బియే గత మూడేళ్ళుగా బద్లాపూర్ లో నివసిస్తోంది. ఆమె ముంబై కన్జూర్ మార్గ్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిని. విజయ్ సంజయ్ ఝార్కడ్ తో అనే యువకుడితో ఆమె సహజీవనం చేస్తోంది.
తమ సహజీవనం గురించి ఇంట్లో తెలిసిపోయిందని, దీనిని తమ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారని కాబట్టి ఇక తమ అనుబంధం కొనసాగబోదని పూనం తేల్చి చెప్పింది. దీంతో ఇద్దరి మద్య బుదవారం రాత్రి గొడవ జరిగింది.
క్షణికావేశంలో విజయ్ చున్నీతో పూనమ్ గొంతు నులిమి చంపేశాడు. ఆ వెంటనే ఇంటి బయట నుండి తలుపు పెట్టి స్నేహితుడి ఇంటికి పారిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితుడికి విషయం చెప్పాడు.
అయితే స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విజయ్ ను అదుపులోకి తీసుకొన్నారు.బద్లాపూర్ లోని మొబైల్ రిపేర్ షాపులో పూనం విజయ్ ను తొలుత కలిసింది.
కొన్నాళ్ళుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు.ఆరు నెలల కిందట పూనమ్ కొనుగోలు చేసిన ఇంట్లోనే వారు ఉంటున్నారు.అయితే ఈ విషయం పూనం ఇంట్లో తెలిసింది. అయితే పెళ్ళి చేసుకోవాలని పూనం విజయ్ ను కోరింది.దీనిని విజయ్ వ్యతిరేకించడంతో ఈ విషయమై ఇద్దరి మద్య గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరిగాయని పోలీసు ఉన్నతాధికారి సునీల్ భరద్వాజ్ చెప్పారు.