వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డుపై ఘోరం: టీచర్‌ని 22సార్లు పొడిచి చంపిన ప్రేమోన్మాది, ఎవరూ కాపాడలేదు (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం నాడు దారుణం జరిగింది. తనను ప్రేమించలేదనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది నడి వీధుల్లో అందరు చూస్తుండగా ఓ ఉపాధ్యాయురాలిని 22సార్లు పొడిచి చంపేశాడు. ఈ ఘటనను చూసిన కొందరు కూడా పట్టించుకోకుండా వెళ్లడం గమనార్హం.

Woman stabbed 22 times by jilted lover in Delhi, dies

నిందితుడి పేరు సురేందర్ (34). అతను గత ఏడాదిగా టీచర్ అయిన కరుణ (21) వెంట పడుతున్నాడు. ఆరు నెలల క్రితం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు దీనిని పట్టించుకోలేదని అంటున్నారు.

కరుణ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురును అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రేమించలేదన్న ఆగ్రహంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు. ఐదు నెలల క్రితం ఫిర్యాదు చేసినప్పుడు ఇరువురి మధ్య రాజీకుదిర్చారని చెబుతున్నారు. కాగా, సురేందర్‌కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా, అక్కడ కేసు కొనసాగుతోందని చెబుతున్నారు.

నాడు రాజీ పడ్డారు: పోలీసులు

గతంలో ఫిర్యాదు అందిన విషయమై పోలీసులు స్పందిస్తూ.. అయిదు నెలల క్రితం సురేందర్ పైన కరుణ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అతడే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పోలీసులు మాట్లాడుతూ.. నాడు సురేందర్ పైన ఫిర్యాదు చేశారని, కానీ ఆ తర్వాత ఇరు కుటుంబాలు రాజీపడ్డాయని చెప్పారు. సురేందర్ భార్యతో విడాకుల కేసు విచారణలో ఉందన్నారు. కరుణను దారుణంగా హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Woman stabbed 22 times by jilted lover in Delhi, dies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X