వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త స్నేహితుడే!.. కోరిక తీర్చమని బలవంతం.. నిరాకరించడంతో హత్య

పిల్లలను స్కూల్‌కు పంపించి.. వసతి గృహంలో ఆనంది ఒంటరిగా ఉన్న సమయంలో.. చెల్లప్ప అక్కడికి వచ్చాడు. కోరిక తీర్చాల్సిందిగా ఆనందిని బలవంతం చేశాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: వివాహేతర సంబంధం మరో మహిళ హత్యకు దారితీసింది. కొన్నాళ్ల పాటు వివాహేతర సంబంధం కొనసాగించి.. అకస్మాత్తుగా ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూడటంతో.. ఆగ్రహించిన ప్రియుడు ఆమెను బలితీసుకున్నాడు. తమిళనాడులోని నెల్లై జిల్లా ముక్కుడలైలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ముక్కుడలై గ్రామానికి చెందిన చంద్రశేఖర్ భార్య ఆనంది(38). వీరికి సుజీధరన్, అస్సుదన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం చంద్రశేఖర్ చనిపోవడంతో.. పిల్లలను పోషించుకుంటూ ఆనంది ఒంటరిగా జీవిస్తోంది.ఇదే క్రమంలో పేటైలోని ఓ వసతి గృహంలో వంటమనిషిగా చేరింది.

కొన్నాళ్ల క్రితం చంద్రశేఖర్ స్నేహితుడైన సింగమ్ పాలైకి చెందిన చెల్లప్పతో ఆనందికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే వసతి గృహంలో చేరిన తర్వాత ఆనంది అతన్ని పక్కనపెట్టేసింది. అతనితో మాటలు తగ్గించేసింది. దీంతో కొంతకాలంగా ఆమెపై చెల్లప్ప తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.

Woman stabbed to death over illicit affair

పిల్లలను స్కూల్‌కు పంపించి.. వసతి గృహంలో ఆనంది ఒంటరిగా ఉన్న సమయంలో.. చెల్లప్ప అక్కడికి వచ్చాడు. కోరిక తీర్చాల్సిందిగా ఆనందిని బలవంతం చేశాడు. ఆనంది అందుకు నిరాకరించడంతో.. ఆగ్రహంతో కత్తితో ఆమెను పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఆనంది అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఐకిరవుండు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసులు చెల్లప్పను అరెస్టు చేసి విచారించగా.. నేరం అంగీకరించాడు. వివాహేతర సంబంధం కొనసాగించనందువల్లే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

English summary
A woman was stabbed to death in Tamilnadu over illicit affair. Accused person held by police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X