యువతి షర్ట్ విప్పేసి, దాడి చేసే యత్నం, ఫిర్యాదుచేసిన స్టూడెంట్..
సమాజంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రోజు జరిగే ఘటనలు వారి భద్రత ఎలా ఉందనే అంశానికి అద్దం పడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, పనిచేసే చోట, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కూడా మహిళలకు సరైన భద్రత ఉండటం లేదు. కొందరు కీచకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడులకు తెగబడుతున్నారు.
ఫాస్ట్ ట్రాక్ ....... మహిళల అత్యాచారాలు, హత్యల విషయంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం
విద్యార్థినికి వేధింపులు
ముంబై సమీపంలోని మలాడ్కి చెందిన 20 ఏళ్ల యువతి రోజు కాలేజీకి వెళుతుంది. ఎప్పటిలాగానే సోమవారం కూడా రైలులో బయల్దేరింది. కానీ ఆమెకు ఓ మత్య్సకారుడి నుంచి వేధింపులు ఎదరవుతాయని ఊహించలేదు. సోమవారం తాను వెళ్తున్న రైలు నుంచి కాందివాలి రైల్వేస్టేషన్ వద్ద దిగేందుకు ప్రయత్నించారు. అయితే అందులో ఉన్న జ్యోతి శర్మ అనే మత్య్సకారుడు (39) కూడా దిగడానికి ట్రై చేయడం వివాదానికి కారణమైంది.
ఆలస్యంగా వెలుగులోకి
సోమవారం ఉదయం 8 గంటల సమయంలో కాందివాలి స్టేషన్లో దిగేందుకు విద్యార్థిని ప్రయత్నించారు. ఆ సమయంలో జ్యోతి శర్మ కూడా దిగేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ ఓకేసారి దిగడంతో, తాకడంతో వారి మధ్య గొడవ జరిగింది. జ్యోతి శర్మను విద్యార్థిని కోపంతో తిట్టింది. దీంతో ఆగ్రహం చెందిన అతడు విద్యార్థిని షర్ట్ విప్పేయబోయాడు. బటన్లు విప్పి.. షర్ట్ తీసేందుకు ప్రయత్నించగా ఆమె షర్ట్ లేకుండా కనిపించిన పరిస్థితి ఏర్పడింది.
పరుగుతీసిన విద్యార్థిని
భయపడ్డ విద్యార్థిని పరుగుతీసింది. కాపాడాలంటూ రైల్వేస్టేషన్లో రన్ తీసింది. ఆమె వెంట అతడు కూడా పరుగెత్తాడు. తనను తిట్టిందనే కారణంతో దాడిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు యువతి బోరివాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని జ్యోతి శర్మ అని గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై 354, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
కఠినంగా శిక్షించండి
విద్యార్థినితో మత్స్యకారుడు జ్యోతి శర్మ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరికొందరు కూడా విద్యార్థులపై దాడులకు తెగబడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.