8మంది ఆడ పిల్లలను కన్నదని ఇంటి నుంచి గెంటేశారు
తాను ఆడ పిల్లలకు జన్మనిచ్చాననే నెపంతో తన అత్తామామలు తనపై దాడికి దిగారని, ఆ తర్వాత తనను ఇంటి నుంచి గెంటేశారని బాధిత మహిళ ఆరోపించింది. ఆడ పిల్లలు కనడంలో తన ఒక్కదానిదే తప్పని, మగ పిల్లలను కనడం లేదని వారు తనను హింసిస్తున్నారని చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు పప్పు దేవి ఎనిమిది మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మరో ఇద్దరు బాలికలు చనిపోయారు. ఆమె భర్త గోపాల్ దేసాంత్రి. ఆమె మగ పిల్లలకు జన్మనివ్వడం లేదని ఆగ్రహించిన ఆమె అత్తామామలు ఆమెను రోడ్డుపైకి గెంటేశారు.
కాగా, పోలీసుల సూచనతో ఆమె మహిళా కాన్సల్టెన్సీని కలిసి విషయాన్ని వివరించింది. అనంతరం కన్సల్టెంట్ శోభా గౌర్ మాట్లాడుతూ.. బాధిత మహిళను ఏడాది క్రితం కూడా అత్తామామలు హింసించారని, అప్పుడు కూడా ఆమె పోలీసులను ఆశ్రయించిందని ఆమె తెలిపింది. బాధితురాలి భర్త కూలీగా పని చేస్తున్నాడని తెలిపింది. బాధితురాలికి తగిన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని ఆమె తెలిపింది.