వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం : డబ్బు చెల్లించలేదని మహిళను స్తంభానికి కట్టి.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

డబ్బు చెల్లించలేదని మహిళను స్తంభానికి కట్టి

బెంగళూరు : కర్నాటకలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో కొందరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హింసించారు. స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెట్టారు. అటుగా వెళ్తున్న వారు ఆ దారుణాన్ని ఆపకపోగా.. చెప్పులు, చీపురుతో కొట్టండని చెప్పడం గమనార్హం.

చామరాజనగర్‌ జిల్లా కొల్లేగల్‌కు చెందిన రాజమని పొట్ట కూటి కోసం హోటల్ నడుపుతోంది. పనిలో పనిగా బెంగళూరులో చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తోంది. చీటీకి సంబంధించి కొందరు వ్యక్తులకు రూ.50వేలు బాకీ పడిన ఆమె ఆ మొత్తం చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు కొడిగెహెళ్లిలో ఆమెను స్తంభానికి కట్టేశారు. డబ్బు తిరిగి చెల్లించాలంటూ చిత్రహింసలు పెట్టారు.

Woman Tied To Pole For Not Repaying Loan

మహిళను స్తంభానికి కట్టేసి హింసించిన ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది వైరల్ అయింది. విషయం తమ దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనతో సంబంధమున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman was tied to a pole in Kodigehalli, Bengaluru, yesterday, allegedly for not repaying a loan she took. Police have arrested 7 people in connection with the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X