ఆమెను ఆలయంలోకి అనుమతివ్వం, సంప్రదాయాలను గౌరవించాలి
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశించలేదని కేరళ ప్రబుత్వం తేల్చి చెప్పింది. ట్రావెన్ కోర్ దేవస్థానం ఆధీనంలో దేవాలయం ఉందని, ఆలయ సంప్రదాయాలను పాటించాలని కేరళ దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్ ప్రకటించారు.అయితే
కేరళ :శబరిమల ఆలయంలోకి మహిళ హక్కుల కార్యకర్తలను అనుమతించబోమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకొంటామని కేరళ దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్ చెప్పారు.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయమై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే శబరిమల ఆలయం ట్రావెన్ కోర్ దేవస్థానం మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందేనని ఆయన చెప్పారు.
శబరిమల దేవాలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే మహిళ హక్కుల కార్యకర్త తృప్తిదేశాయ్ ను అడ్డుకొంటామని ఆయన చెప్పారు. ఆలయ సంప్రదాయాలను పాటించాల్సిందేనని ఆయన చెప్పారు.
ఆలయాల్లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ సంస్థ వ్యవస్థాపకురాలు వెయ్యి మంది మహిళలతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. దరిమిలా కేరళ మంత్రి స్పందించారు. ఈ ఆళయంలోకి 10 నుండి 50 ఏళ్ళలోపు మహిళల ప్రవేశంపై నిషేదం ఉంది. ఈ నిషేదం పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.