అత్యాచార భారతం: మూడు రోజులు యువతిని బంధించి అత్యాచారం
చండీఘఢ్ : చట్టాలు ఎంత కఠినతరం చేసినా కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం లేదు. తాజాగా పంచకులాలో 21 ఏళ్ల వివాహితపై 10 మంది మూడురోజులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వెళ్లిన వివాహిత కామాంధుల కామానికి బలైపోయింది.
పోలీసుల కథనం ప్రకారం... మనిమజ్రా ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి మార్నీ హిల్స్లోని గెస్ట్హౌజ్కు రమ్మన్నారు. ఆ మహిళ వెళ్లాగానే అక్కడ అప్పటికే 10మంది పురుషులున్నారు. గెస్ట్హౌజ్కు చేరుకున్న మహిళను బంధించి వంతుల వారీగా ఆమెపై అత్యాచారం చేశారు ఈ మృగాళ్లు. జూలై 15 నుంచి 18 వరకు 10 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. అయితే అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరు తన భర్తకు తెలుసునని ఆమె చెప్పింది.
మహిళ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు గెస్ట్ హౌజ్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ హనీ అవతార్గా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా వారికి 14 రోజుల రిమాండ్ కోర్టు విధించింది.