మహిళలు చాల సున్నితమైన వారు వారు పిల్లల కోసం ఉద్యోగాలు మానేయాలి.
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతుంటే , మరోవైపు వారు అతి సున్నితమైనవారని వారు ఇంటికే పరిమితం కావాలని ఓ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపాయి.మహిళలలు పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉందని ఆమే అసెంబ్లీ ఆవరణలోనే వ్యాఖ్యానించారు.
ఇప్పటికే గోవా మహిళలు చాల డెలికేట్గా ఉంటారని గోవా మాజీ సీఎం వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మరో బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ,అలీనా సాల్దీనా మహిళలు చాల సున్నితమైన వారు అంటూ ,వారు ఇంటికే పరిమితం కావాలని మీడియా ముందు ప్రకటించారు. దీంతో పాటు వారు రాత్రీ పూట పనులకు కూడ వెళ్లకుండా పిల్లల సంరక్షణ చూసుకోవాలని సూచించారు. పిల్లలను ఇంట్లో ఉండి చూసుకోవడం చాల అవసరమని కూడ ఆమే చెప్పారు.
కాగా స్త్రీలు పురుషుల కంటే చాల సున్నితమైన శరీర తత్వమని అని ప్రకటించారు. పిల్లలు స్కూలుకు వెళ్లినప్పుడు వారి కోసం తల్లులు ఇంట్లో ఉండడం వల్ల చాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. తల్లులు కూడ ఉద్యోగాలకు పోవడం వాళ్ల పిల్లల మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని అన్నారు. వారికి ఇంట్లో ఉండి ఏం చేయాలో తోచదని ,ఇందుకోసం వాళ్లు ఇంటిపట్టునే ఉండాలని హితవు పలికారు.