వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాను జయించటంలో మహిళలే శక్తివంతులట...ఆసక్తికర అధ్యయనం

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ మహమ్మారి జయించడంలో పురుషులతో పోల్చుకుంటే మహిళల్లోనే అధికంగా శక్తి ఉందని తేల్చింది ఒక సర్వే. మహిళలలో వ్యాధి నిరోధక శక్తి పురుషుల కంటే ఎక్కువగా ఉండటంతో వారు కరోనాను ఈజీగా జయించగలుగుతున్నారని తాజా పరిశోధనలో రుజువైంది .ప్రపంచమే కరోనాతో పోరాడుతున్న సమయంలో కరోనాకు సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి .

వాడని అపార్ట్ మెంట్ లలోనూ, ఎవరూ లేని చోట కూడా .. కరోనా వైరస్ .. ఎలాగంటే !!వాడని అపార్ట్ మెంట్ లలోనూ, ఎవరూ లేని చోట కూడా .. కరోనా వైరస్ .. ఎలాగంటే !!

మహిళల్లో కరోనాను జయించే వ్యాధినిరోధక శక్తి ఎక్కువ

మహిళల్లో కరోనాను జయించే వ్యాధినిరోధక శక్తి ఎక్కువ

సహజంగా పురుషులు శక్తివంతులైనప్పటికీ మహిళలు, పురుషుల కంటే ఎక్కువగా వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉంటారు. అందుకే సహజ మరణాల్లో చూసినా పురుషుల సంఖ్య అధికంగా ఉంటుంది.

ఇక ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఎవరిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంది అన్న అంశంపై జరిపిన పరిశోధనల్లో మహిళల్లోనే కరోనాను జయించే వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉందని రుజువైంది .కరోనా నుండి మహిళలు ఈజీగా కోలుకుంటున్నారని అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన నేచర్ జర్నల్ చెబుతోంది.

కరోనాను ఎదుర్కొనే టీ సెల్స్ ప్రభావవంతంగా పని చేసేది మహిళలలోనే

కరోనాను ఎదుర్కొనే టీ సెల్స్ ప్రభావవంతంగా పని చేసేది మహిళలలోనే

కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి టీ సెల్స్ ఎంతగానో దోహదం చేస్తాయి. అటువంటి టీ సెల్స్ ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా ఉంటున్నాయని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మహిళల తో పోల్చుకుంటే పురుషుల్లో ఈ టీ సెల్స్ ఎక్కువ ప్రభావవంతంగా పని చేయడం లేదని రుజువైంది.

98 మంది కరోనా బాధితులను పరీక్షించి పరిశోధించిన క్రమంలో ఈ విషయాన్ని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. రోగనిరోధక శక్తిని పెంచి, పోరాడే బలం చేకూర్చే సైటోకైన్స్ వ్యవస్థ కూడా మహిళలలో చాలా గొప్పగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఇండియాలో కూడా పురుషులే అధికంగా మృతి చెందారని డేటా

ఇండియాలో కూడా పురుషులే అధికంగా మృతి చెందారని డేటా


ఇదిలా ఉంటే భారతదేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుతుందని, ప్రజలు కోలుకుంటున్న సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది . ఇక ఇటీవల ఇచ్చిన డేటా ప్రకారం కోవిడ్ -19 మరణాలలో 69% పురుషులు మరియు 31% స్త్రీలు ఉన్నారని తెలిపింది.దీనిని బట్టి కరోనా బారిన పడి మృతి చెందుతున్న వారిలో అధిక శాతం పురుషులే అన్నది అర్ధం అవుతుంది. అంతే కరోనాతో పోరాడే శక్తి మహిళల్లో ఎక్కువగా ఉండటం వల్లే వారి మరణాల శాతం తక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక పురుషుల్లోనే అధిక భాగం మృతి చెందినట్లుగా గణాంకాలను బట్టి స్త్రీల కంటే పురుషులకే కరోనాతో రిస్క్ ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Recommended Video

AP Schools Reopening సాధ్యమేనా ? వ్యాక్సిన్‌ వచ్చే వరకూ స్కూళ్లను మూసెయ్యాలి!
 కరోనా బారిన పడే ప్రతిముగ్గురిలో ఒక మహిళ .. అయినా జయించటంలో వారే శక్తివంతులు

కరోనా బారిన పడే ప్రతిముగ్గురిలో ఒక మహిళ .. అయినా జయించటంలో వారే శక్తివంతులు

కరోనా బారిన పడుతున్న వారిలో దాదాపు ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఉంటున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మహిళల డెత్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందుకు కారణం . దేనినైనా తట్టుకునే శక్తి మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. వారిలో వ్యాధి నిరోధక వ్యవస్థ పురుషులతో పోల్చుకుంటే బలంగా ఉంటుంది. కరోనా బారిన పది మృతి చెందుతున్న మహిళల్లో ముఖ్యంగా అనీమియాతో బాధ పడుతున్నవారు, ఇతరత్రా ఆనారోగ్య సమస్యలతో బాధ పడేవారే ఎక్కువ. అలాంటి వారికే హైరిస్క్ ఉంటుంది . ఏది ఏమైనా కరోనాను జయించటం పురుషుల కంటే మహిళలకే సాధ్యం అవుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి .

English summary
One survey found that women were more likely than men to conquer the coronavirus epidemic. Recent research has shown that women have a higher level of immunity than men and are able to easily conquer the corona. Women are recovering easily from the corona, says the journal Nature at yale University in the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X