హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్పై చర్యకు డీజీపీకి లేఖ రాసిన మహిళా కమిషన్
హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తపై హర్యానా మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తపై హర్యానా మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా హనీప్రీత్ మీద ఆరోపణలు చేసి, ఆమె పరువు తీస్తున్నాడంటూ హర్యానా మహిళా కమిషన్ ఆరోపణలు చేసింది.
Recommended Video
డేరా బాబాకు, తన మాజీ భార్య హనీప్రీత్కు మధ్య అక్రమ సంబంధం ఉందంటూ మీడియా సమావేశం పెట్టి హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్త వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా హనీప్రీత్ మీద ఆరోపణలు చేసి, ఆమె పరువు తీస్తున్నాడంటూ హర్యానా మహిళా కమిషన్ ఆరోపించింది. దీనికి సంబంధించి విశ్వాస్ గుప్త మీద వెంటనే చర్య తీసుకోవాలని లేఖ రాసింది. ఈ మేరకు బీజేపీ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్ ప్రతిభ సుమన్, హర్యానా డీసీపీ బీఎస్ సాంధూకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
2009లోనే హనీప్రీత్కి విడాకులిచ్చిన విశ్వాస్, ఇప్పుడు ఆమెపై నిందలు వేయడం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. విశ్వాస్ గుప్త మీడియా సమావేశం గురించి చేసిన ఫిర్యాదు తీసుకుని మానవ హక్కుల గ్రూపు లాయర్లు తనను ఆశ్రయించారని ఆమె చెప్పారు. వారి వినతి మేరకే తాను లేఖ రాసినట్లు ప్రతిభ సుమన్ పేర్కొన్నారు.