పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అవి వాడుతారు
ఇండియాలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా స్మార్ట్ పోన్లను ఉపయోగిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది.స్మార్ట్ పోన్లలో ఉన్న అన్ని రకాల అప్లికేషన్లను మహిళలు ఉపయోగిస్తారని ఈ సర్వే తేల్చింది.
న్యూఢిల్లీ :ఇండియాలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా స్మార్ట్ పోన్లను ఉపయోగిస్తున్నారని తేలింది. పురుషుల కంటే మహిళలే స్మార్ట్ ఫోన్లలో ఉన్న అన్ని రకాల ఆప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ ఫోన్లలో ఉన్న అన్ని రకాల అప్లికేషన్లను ఉపయోగించడంలో స్త్రీలే ముందున్నారని ఓ సర్వే వెల్లడించింది.
ఇండియాలో స్మార్ట్ ఫోన్ల వినియోగంలో పురుషుల కంటే స్త్రీలే ముందున్నారని ఓ సర్వే తేటతెల్లం చేసింది. ఈ సర్వే చెబుతున్న వివరాల ప్రకారంగా పురుషుల కంటే ఎక్కువ మంది మహిళల వద్దే స్మార్ట్ పోన్లు ఉన్నాయని తేలింది.
స్మార్ట్ ఫోన్లలో ఉన్న గేమ్స్ తో పాటు ఇతర అప్లికేషన్లను ఎక్కువగా మహిళలే ఉపయోగిస్తున్నారని సర్వే తేల్చింది. దేశంలో మొబైల్ వినియోగదారులు, స్మార్ట్ పోన్లు, పీచర్ పోన్లను ఏ మేరకు వినియోగిస్తున్నారో తెలుసుకొనేందుకు మొబైల్ మార్కెటింగ్ అసిసోయేషన్ పరిశోధన సంస్థ ఐఎంఆర్ బి సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ వీడియోలు, ఆటల కోసం పురుషుల కంటే మహిళల కంటే రెండు రెట్ల అధికంగా మహిళు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా పురుషుల కంటే ఫేస్ బుక్ లో సమయాన్ని వెచ్చిస్తారని తెలిపాయి. ప్రతిరోజూ టివీలు, ఇతర మాథ్యమాల కంటే అధికంగా దాదాపు మూడు గంటలపాటు సగటున ప్రతి ఒక్కరూ స్మార్ట్ పోన్ ను వినియోగిస్తారని తేలింది.