బెంగళూరులో సహజీవనం, అసహజ శృంగారం కావాలన్నాడు, ప్రియుడిని చంపేసిన ప్రియురాలు !
పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అసహజ శృంగారం చెయ్యాలని పీడించిన ప్రియుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. మద్యం మత్తులో రోడ్డు మీద పడి మరణించాడని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిన మహిళను బెంగళూ
బెంగళూరు: పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అసహజ శృంగారం చెయ్యాలని పీడించిన ప్రియుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. మద్యం మత్తులో రోడ్డు మీద పడి మరణించాడని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిన మహిళను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరులో కోణెనకుంట క్రాస్ సమీపంలో 32 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ప్రైవేట్ బస్సు కండెక్టర్ గా పని చేస్తన్న ముత్తురాజ్ ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. విధులు పూర్తి అయిన తరువాత కండెక్టర్ ముత్తురాజ్ పీకల దాక మద్యం సేవించి ప్రియురాలి ఇంటికి వెళ్లేవాడు.
ఎప్పటిలాగే గురువారం రాత్రి ముత్తురాజ్ పీకలదాక మద్యం సేవించి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అసహజ శృంగారం చెయ్యాలని ప్రియురాలిని పీడించాడు. విసిగిపోయిన ఆమె మద్యం మత్తులో ఉన్న ప్రియుడు ముత్తురాజ్ గొంతు నులిమి చంపేసింది.
అర్దరాత్రి దాటిన తరువాత రోడ్డు మీద ఎవ్వరూ లేరని ఆమె గుర్తించింది. ముత్తురాజ్ మృతేదహాన్ని రోడ్డు మీదపడేసింది. మరుసటి రోజు ఉదయం మద్యం మత్తులో రోడ్డు మీద కుప్పకూలి ముత్తురాజ్ మరణించాడని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోస్టుమార్టుం రిపోర్టులో ముత్తురాజ్ హత్యకు గురైనాడని వెలుగు చూడటంతో శనివారం అతని ప్రియురాలిని కోణెనకుంట పోలీసులు అరెస్టు చేశారు.